భగవంతుడు మనిషితో మాట్లాడితే-2
భగవంతుడు సృష్టి కర్త. అత్యంత శక్తివంతడు . మనిషి భగవంతుని భక్తి చేస్తూ ప్రార్ధిస్తాడు, కీర్తిస్తాడు . భగవంతుని కోసం అన్వేషిస్తూ ఉంటాడు . తనను దుఃఖం నుంచి విడిపించుకుని అడుగు తాడు , కోరికలను తీర్చమని ప్రాధేయపడతాడు .
మనిషి ఇన్ని చేసినా భగవంతుడు మాత్రం మనిషి తో మాట్లాడినట్టు ఎక్కడా అనిపించదు. సమాధానం ఇచ్చి నట్టు వినిపించదు . మౌనం గా నే ఉంటాడు .
• కానీ అప్పటి వరకూ ఎదురు చూసిన మనిషి భగవంతుని పై ఓర్పు నశించి, సహనం కోల్పోయి , భగవంతుని పై నమ్మకం సన్నగిల్లి ఉంటాడు . ఇదే మనిషి యొక్క అజ్ఞానం , మాయా ప్రభావం .
• మనిషికి , భగవంతుడు లభించేది , మనిషి తో మాట్లాడేది కేవలం మౌనం లోనే , మౌనం తోనే . మౌనం మహత్తరమైన శక్తి . ఏకాంతం లో ఉంటూ మౌనం తో , శబ్ద రహితమైన స్థితి లో భగవంతుని తో కూర్చుని ధ్యానం చేస్తూ అనుసంధానం అయినపుడు, భగవంతుడు మాట్లాడుతాడు . ఆ భాష మౌన భాష . ఆ సంకేతం మనిషి ఎదురు చూస్తున్న దానికి సమాధానం . మాట్లాడడానికి మించి స్పష్టం గా కంటికి అన్నీ చూపిస్తాడు .
• మౌనం . . . సృష్టి స్థితి లయల శక్తితో నిండి ఉన్న దివ్యమైన భాష . అదే భగవంతుడు మనిషితో మాట్లాడడానికి , అనుసంధానం అవడానికి ఎంచుకున్న విధానం అని నేటి కాలపు మనిషి కి తెలియదు .
• సంపూర్ణ మైన మౌనం తో రోజూ కొన్ని గంటల సమయం ఏకాంతం గా, తెల్లవారుజామున నిశ్శబ్ద వాతావరణంలో , ఏ శబ్దం నోటితో పలకకుండా భగవంతుడిని , మనసు లో స్మృతి చేస్తూ ఉంటే, భగవంతుడు మనిషి కి సమాధానం ఇవ్వడం ఆరంభిస్తాడు .
• ఇందులో మొదట మనిషి కి అర్దం చేయించేది , నీవు ఎవరు? నేను ఎవరు? నీవు ఎందుకు జన్మ తీసుకున్నావు ? నీవు ప్రస్తుతం ఏం చేస్తున్నావు ? ఇలా ఎన్నో ఎన్నెన్నో సూక్ష్మ రహస్యాలు తెలియ చేస్తాడు .
మనిషిని పవిత్రంగా , ఉన్నతంగా కావించేందుకు మనిషి యొక్క లోపాలు మానసిక వికారాలు , బలహీనతలు , జన్మాంతరాలుగా సంపూర్ణం కాకుండా మిగిలి ఉన్న కర్మలు , కర్మ బంధనాలు , చేసిన పాప పుణ్య కర్మల లెక్కల ఖాతాలు అన్నీ క్రమేపీ ఆధారాలతో అర్దం చేయిస్తాడు . వాటన్నింటి నుంచి సంపూర్ణంగా విముక్తుడిని చేసే మార్గం చూపిస్తాడు .
ఇదంతా భగవంతుని పై నిశ్చయం తో , పూర్తి బలిహరం అయినప్పుడే సాధ్యం అవుతుంది .
• సమస్య అంతా మనిషి కి ఇక్కడే ఎదురవుతుంది . ఎందుకంటే మనిషి దేనిని అంత సులభంగా అంగీకరించడు . సాక్షాత్ భగవంతుడు వచ్చి మనిషి కి తన అంతర్గత స్థితి ని అర్దం చేయించి పరివర్తన చెయ్యాలి అనుకున్నా సరే భగవంతుడిని శిరసావహించ లేడు . ఎందుకంటే మనిషి లో నేను అనే అహం , మాయ మైకం తో పేరుకు పోయిన అజ్ఞానం , తన శరీరం పై ఉన్న వ్యామోహం , మమకారం . మరియు కామ వికారాల ప్రభావం. ఇంద్రియ నిగ్రహము లేకపోవడం. ఇవన్నీ కలిసి మనిషి ని భగవంతుని కి దూరంగా చేస్తాయి .
• భక్తి లో పతిత పావన రండి , వచ్చి మమ్మల్ని పావనం చేయండి అని పాటలు పాడుతూ భగవంతుడుని మనిషి పిలుస్తాడు . తీరా భగవంతుడు వచ్చి తన శక్తి తో జ్ఞానం ఇచ్చి , మనిషి ని చైతన్య వంతం గా పవిత్రుడు గా చేయాలని , తన సమానంగా దివ్య గుణాల వారసుడిగా చేయడం ఆరంభిస్తే , మనిషి అందుకు సంసిద్ధం కాడు , కాలేడు . ఎందుకంటే అనేక జన్మలు గా మాయ, వికారాల ఊబిలో కూరుకు పోయి ఉండడం , వాటికి దాసోహం అయిపోవడమే కారణం . నేడు , శారీరక మానసిక వికారాలు లేకుండా , శుద్ది కలిగిన మనసు తో , సత్యమైన మాట తో బ్రతక లేని స్థితి లో మనిషి జీవిస్తున్నాడు అనేది ఏ మనిషి కి తెలియని యదార్థం కాదు .
• శరీరం వేరు , ఆత్మ వేరు అనే రహస్యమైన విషయం గ్రహించ లేని స్థితిలో మనిషి భగవంతుని భక్తి చేస్తాడు . ఈ విషయం స్వయం భగవంతుడు అర్దం చేయించే వరకు , నేను ఆత్మ ను అనే విషయం ఎవరికీ తెలియదు.
• భగవంతుడి శక్తి ని మనిషి స్వీకరించినపుడు, ఆ శక్తి తోనే మనసు , బుద్ధి , ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అయి భగవంతుని సన్నిధి చేరుకోగలం . సన్నిధి చేరడం అంటే భగవంతుని వలే జనన మరణాలకు అతీతంగా అవడం కానేకాదు . భగవంతుడి సన్నిధి చేరడం అంటే తిరిగి విశ్వ రాజ్యాధికారిగా ఉన్నతమైన జన్మలు ఎత్తే భాగ్యం కలిగి ఉండడం .
• మనిషి తాను ఒక శరీరం అనే భావన కంటే తాను ఒక ఆత్మ మరియు శక్తి అనే సత్యమైన స్థితి లో ఉన్నప్పుడు మాత్రమే పరమాత్ముడు ఒక శక్తి స్వరూపం అనే అనుభవం పొంది …. భగవత్ శక్తి స్వీకరించగలడు , తద్వారా సత్కర్మలు ఆచరించగలడు .
జీవితం లో మనకు అన్నీ దొరకక పోవచ్చు. కానీ దొరికిన వాటి విలువ తెలుసుకుంటే జీవితం చాలా అందంగా ఉంటుంది.
• Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet KETU .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
ఆత్మ ✍️ 13 May 2026 1:50 AM.


.jpg)



