• మానవ సంబంధాలలో అభిప్రాయ భేధాలు కలగడం సహజం , కలహాలు సంభవించిడం సర్వ సాధారణం. ఇవి ఒకోసారి తారాస్థాయికి చేరుకుంటాయి. ఒకరితో మరొకరు కలిసి ఉండలేనంతగా , ఒకరిని మరొకరు భరించలేనంత పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది .
ఈ సమస్య ప్రతి మనిషి తన జీవితంలో ఏదో సమయం లో ఎవరో ఒకరితో ఏదో ఒక సందర్భంలో అనుభవించ వలసి వస్తుంది .ఆ సమయంలో వ్యక్తుల మధ్య కలహాలు , దూషణలు పెరుగుతాయి . ఓర్పు సన్నగిల్లి ఆ బంధాన్ని తుంచి వేయాలి , కట్ చేసుకోవాలి అనిపిస్తుంది .
• బంధాలు ఎటువంటివి అయినా సరే బలవంతంగా తెంపకండి , కట్ చేయకండి . ఎందుకంటే ఆ బంధం వేసుకున్నది , కలుపుకున్నది మనమే కాబట్టి . ఆ బంధం లో సమస్య ఉంటే , అది సరియైన బంధం కాకపోతే , ఆ బంధాలలో వ్యక్తుల మధ్య పొంతన కుదరకపోతే కనుక ఆ బంధాన్ని కొన “సాగ” నివ్వండి .
• బంధం అంటే మనకు మనం గా , కోరుకొని పెన వేసుకున్న, లేదా ముడి పెట్టుకున్న తాడు. దానిని బలవంతంగా తెంపకూడదు, ఆ బంధం లోని వ్యక్తులతో సమస్యలు వచ్చి నప్పుడు మనకు మనం కట్ చేయకుండా , కాస్త ఓర్పు వహిస్తే . . . ఆ బంధం సాగి సాగి అనగా పలచబడి దానంతట అదే సహజం గా తెగిపోతుంది , లేదంటే బంధం లోని సమస్య పరిష్కారం అవుతుంది.
• అంతవరకు ఆ బంధాన్ని కాస్త భరించే గలిగితే ఏదో రూపంలో ఏదో విధంగా ఎవరో ఒకరి సహాయం వలన సహజంగా తెగిపోతుంది . అంతే కానీ బలవంతంగా మాటలతో చేతలతో ఆ బంధాన్ని తెంపకూడదు .
• బంధాలు అనేవి చేసిన కర్మల అనుసారం మనిషికి ఏర్పడతాయి . మనిషి తనకు తాను కోరుకొని కలుపుకొని ఏర్పరుచుకున్నవి . ఇందులో భగవంతుని ప్రమేయం ఉండదు . ఎందుకంటే ఏ మనిషి కూడా భగవంతుని ఆమోదం తీసుకొని బంధాన్ని కలుపుకోడు . మనిషి తన అవసరం కోసమే బంధాలను సృష్టించుకుంటాడు .
• ఈ బంధాలు అనేవి కర్మ బుణాలు. ఒకవేళ మనకు ఒకరితో ఇబ్బంది ఉంది అని బంధాన్ని కట్ చేస్తే , అదే ఇబ్బంది కర స్థితి తో కూడిన కర్మ మరొకరితో తప్పకుండా ఆరంభం అవుతుంది. ఇది పరమ సత్యం .
బంధాలలో ఉన్న కర్మ బుణం అనేది మనిషి కి ఎవరితో ఏ విధంగా ఉన్నా ఆ వ్యక్తులతో తీరి పోవలసిందే . బంధాల లోని వ్యక్తులు ఇబ్బంది పెట్టే స్థితి ఉంటే ఓర్పు వహించి సహించి కాలానికి వదిలెయ్యండి , భగవంతుడుని స్మరించండి . ఎందుకంటే కాలంలో కాలుడు (శివుడు) ఉంటాడు. ఆ సమస్యాత్మక బంధాలను ఎలా పలుచగా (dilute) చేయాలో కాలుడికి తెలుసు . అప్పుడు ఆ బంధం అనే తాడు సాగి సాగి సన్నగిల్లి సహజంగా తెగిపోతుంది లేదా పరిష్కారం అవుతుంది .
• బంధం అంటే ఏదైనా కావచ్చు . . . స్నేహబంధం , ప్రేమ బంధం, దాంపత్య బంధం, రక్త(సం)బంధం, అక్రమ(సం)బంధం , వ్యాపార బంధం . ఇలా ఎన్నో ఎన్నెన్నో మానవుడికి దుఃఖం, అశాంతి కలిగించేవి ఈ బంధాల లోని పాత్ర లే .
కర్మ ఏ రూపంలో ఎవరితో ఎలా ఉన్నా అనుభవించ వలసినపుడు అనుభవించ వలసిందే. ఆ కర్మ ను బలవంతంగా తుంచకూడదు . శివుని స్మృతి లో ఆ కర్మ ఆచరించడం వలన తేలికగా తొలగిపోతుంది.
• గమనించాలి . . .
ఈ రచన యొక్క అర్దం ఎవరూ కూడా బంధాలను ఏర్పరచుకోవద్దు అని కాదు , బంధాలకు దూరంగా ఉండమని అసలే కాదు . బంధాల ద్వారా వ్యక్తులను భరించ లేని స్థితి కలిగినపుడు , సమస్యలు వచ్చినప్పుడు , కట్ చేయకండి . ఓర్పుతో ఉండండి.
భార్య భర్తలు విడాకులు వంటివి తీసుకోకండి . రక్త (సం)బంధీకులు ఆస్తుల కోసం హింసకు పాల్పడకండి . స్నేహితులు మాటలతో ఈర్ష్య ద్వేషాలు తో దూషించుకోకండి . ప్రేమికులు నమ్మించి మోసం చేసేలా జిత్తులమారి నటన వేషాలు అవలంభించకండి .
వీటన్నింటి బదులు భగవంతుని స్మృతి చేయండి . మీకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బంధాలలోని వ్యక్తులతో శాశ్వత విముక్తి లభిస్తుంది లేదంటే కనీసం వారిలో మార్పు వస్తుంది . మీ సమస్య తీరి సంతోషంగా ఉంటారు . ఇది పరమ సత్యం .
• 2017 వ సంవత్సరంలో , నేను , నా భార్య మా అబ్బాయి కలిసి అరుణాచలం వెళ్ళాం . ఆ సమయంలో మా అబ్బాయి 8 వ తరగతి చదువుతున్నాడు .
• ఆ రోజు ఆలయం లో శివుని దర్శనం అయిన తరువాత చూస్తే చాలా మంది విదేశీయులు కనిపించారు. అక్కడ నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము . అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది . ఎటు చూసినా నెమళ్లు కనిపిస్తున్నాయి. ఆశ్రమ ప్రాంగణం లోపల , రమణుల సమాధి వద్ద కొందరు , ఆ ప్రక్కనే ఉన్న శివలింగం ఎదుట అనేక మంది విదేశీ స్ర్తీ లు చీర లో , విదేశీ పురుషులు పైజామా లాల్చీ లో వస్త్రాలు ధరించి లో శివ ధ్యానం చేయడం కనిపించింది. వారిలో ప్రతి ఒక్కరికీ నుదుట కుంకుమ బొట్టు ఉంది . ప్రత్యక్షం గా అదంతా చూస్తున్న నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది .
• భారతదేశం లో ఉన్న మనం శివుని ఆరాధించడం అనేది మన హిందూ సాంప్రదాయం లో భాగం గా , భక్తి సంస్కృతుల పరంపరలో మనకు సహజంగా అలవడతాయి.
కానీ విదేశీయులు, వివిధ పాశ్చాత్య దేశాల్లో పుట్టి , భిన్న సంస్కృతి సంప్రదాయాల్లో పెరిగిన వారు, అసలు దైవ భక్తి , మన ధర్మం తెలియని వారు , ఇంకా చెప్పాలంటే భారతదేశ మూలాలకు ఏ సంబంధం లేని వారు శివుని పూజించడం , ధ్యానించడం ఏమిటి ? పైగా ఎన్నో సముద్రాలు దాటి ఇంత దూరం అసలు శివుని ఆలయానికి , రమణుల ఆశ్రమానికి ఎలా వస్తారు?. విలాసాల జీవనానికి మొగ్గు చూపించే విదేశీయులు ఇంత నిరాడంబరంగా ఎలా ఉంటున్నారు ? అని ఎన్నో ప్రశ్నలు మనసు లో వచ్చాయి . కానీ సమాధానం దొరకలేదు.
• రమణాశ్రమం లో కాసేపు నేను, నా కుటుంబం తో ధ్యానం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాం . మేము బస చేసిన శివ సన్నిధి సత్రం వద్దకు వెళుతూ ఉండగా , అరుణాచలం రోడ్ మీద సైకిళ్ళు తొక్కుతూ కొందరు విదేశీ స్త్రీ పురుషులు చీర, లాల్చీ పైజామా లో కనిపించారు . అలానే మేము నడుస్తూ కొంచెం ముందుకు వస్తుంటే మరి కొందరు విదేశీయులు చెప్పలు లేకుండా నడుచు కుంటూ మాకు ఎదురయ్యారు . వాళ్లు మమ్మల్ని , ఇంకా రోడ్ పై వెళ్లే మరి కొందరిని చాలా ప్రశాంతంగా కళ్లలో కి కళ్లు పెట్టి చూస్తూ , ఓం నమఃశివాయ అంటూ చిరు నవ్వుతో పలకరిస్తూ వెళ్తున్నారు .
• అది చూసిన నాకు, మా అబ్బాయి కి కూడా చాలా వింతగా అనిపించింది. వెంటనే మా అబ్బాయి అడిగాడు, నాన్నా ఫారినర్స్ అంతా లగ్జరీ ఎంజాయ్ మెంట్ , డిఫరెంట్ కల్చర్ లో ఉంటారు కదా, వీళ్లు ఏంటి ఇక్కడ ఇలా మన ఏన్షియంంట్ సేజ్ స్ (పూర్వ కాలం మునులు) వలే జుట్టు పొడవుగా పెంచుకుని ఉన్నారు , అని అడిగాడు. అప్పటికే అవే ఆలోచనలు ప్రశ్నలు నా మనసు లో తిరుగుతూ ఉండడం, వాటికి సమాధానాలు నా వద్ద లేక పోవడం వలన మౌనం గా ఉండి పోయాను .
• ఎవరినైనా ఈ విషయం గురించి అడిగితే సంతృప్తి కరమైన సమాధానం చెప్పలేదు . కానీ అక్కడ ఉన్న కొందరు ఇలా చెప్పారు , విదేశీయులు అనేక మంది ప్రతి సంవత్సరం లో ఆరు లేదా మూడు నెలలు పాటు అరుణాచలం వచ్చి ఆ సమయం అంతా శివాలయం లోను మరియు, రమణాశ్రమం లోనూ ధ్యానం చేస్తూ ఉంటారు , అని చెప్పారు.
• కానీ , మనం భగవంతుని పై సత్యమైన నమ్మకం విశ్వాసం ఉంచినప్పుడు కాస్త ఆలస్యమైనా మనకు తప్పక మనకు కావలసిన సమాధానం , లేదా మనం పొందవలసినవి తప్పక పొందుతాం. ఎందుకంటే ఇది భగవంతుని బాధ్యత.
ఇది నాకు అనేక సందర్భాల్లో, అనేక విషయాలలో నిరూపణ అయింది, ఇంకా నేటికీ అవుతూనే ఉంది, అవసరం లేనివి నా నుంచి ఏదో రూపంలో దూరం అవడం , అవసరం అయ్యేవి మాత్రమే దగ్గరగా ఉండడం శివలీల అనిపిస్తుంది .
• అరుణాచలం లో విదేశీయుల గురించి తలెత్తిన సందేహం మనసులో అలాగే అప్పటి నుంచి మిగిలి పోయింది.
🌹🌹🌹🌹
North Carolina , USA
• 2025 లో సంవత్సరం లో నేను, మా అబ్బాయి కలిసి శివరాత్రి సమయం లో రాజస్థాన్ లో , మౌంట్ అబూ, బ్రహమకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి వెళ్లాము . పది రోజులు అక్కడే ఉన్నాము . శివరాత్రి సమయం లో తండ్రి అయిన పరమాత్మ శివుని తో మిలనం (కలయిక) అత్యంత మనో వైభవంగా మౌంట్ అబూ లో జరుగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా పోర్చుగీసు, డచ్ , రష్యా , అమెరికా , ఆస్ర్టేలియా , ఇండొనేషియా , జపాన్ , ఇరాన్ , ఇలా ఎన్నో వివిధ దేశాల నుంచి వేలాది మంది విదేశీయులు వచ్చి ఉన్నారు . నాకు మరలా అదే ఆశ్చర్యం, అసలు విదేశీయులు ఏంటి , ఇంత దూరం రావడం, వీరంతా శివుని గురించి తెలుసుకోవడం, శివధ్యానం చేయడం వెనుక ఏదో బలమైన సూక్ష్మ రహస్యం ఉంటుంది అని మనసులో అనిపించింది .
• నా ఈ సందేహానికి మౌంట్ అబూ లో ఉండగానే ఆ మరుసటి రోజు నే , శివ పరమాత్ముని గీతా జ్ఞానం క్లాస్ (మురళి) ద్వారా సమాధానం లభించింది . ఆ సమాధానం చాలా అద్భుతంగా , ఆధార భరితంగా , ఈ విధంగా ఉంది .
ఈ సంగమ యుగం లో (కలియుగం అంతం అవుతూ, సత్య యుగం ఆరంభం అయ్యే కాలం) . . . నేను (శివ పరమాత్మ) తిరిగి సత్య యుగ స్థాపన కు భరత భూమి పై వృద్ధ మానవ తనువు లో అవతరిస్తాను .
• ఈ విశ్వం ఆది లో అనగా కల్పం (5000 సంవత్సరాల) క్రితం సత్య యుగం లో ఎవరైతే నా పిల్లలు (ఆత్మలు) , ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో , . . వారంతా జనన మరణ చక్రంలో తిరుగుతూ కాల క్రమేణా వేరు వేరు ధర్మాలలో కి వెళ్లి పోయారు .
బౌద్ధ , క్రిష్టియన్ , ముస్లిం , జైన్ , సిక్కు , ఇలా ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా అనేక ధర్మాలలో కి వెళ్లి ఉన్నారు .
నేను (శివ పరమాత్మ) భూమి పై అవతరించిన ఈ కలియుగాంత సమయం లో , ఈ విశ్వం అంతా నిండి ఉన్న నా పిల్లలు (ఆత్మలు) ఎవరు ఏ ధర్మానికి చెందిన వారైనా సరే . . . ఆదిలో సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన నాపిల్లలు (ఆత్మలు) నన్ను వెతుక్కుంటూ వారి మూల స్థానం అయిన ఈ భరత భూమి కి చేరుతారు . తిరిగి నన్ను కలిసి నా ద్వారా రాజయోగం పొందుతారు . అని స్పష్టం గా గీతా జ్ఞానం ద్వారా ఆ రోజు సమాధానం లభించింది . . .
• అప్పుడు నాకు అర్దం అయింది ఒకటే … అరుణాచలం లో నేను చూసిన విదేశీయులు , ఎక్కడో విదేశాలలో క్రిష్టియన్, జోరాస్ట్రియన్ , ఇస్లాం , బౌద్ద ధర్మాలలో నేడు పుట్టినవారు . . . కొన్ని యుగాల క్రితం భారతదేశ సంతతి కి చెందిన వారు . వారు అప్పటిలో శివుని ఆరాధించే వారు . వారు (ఆ ఆత్మలు) జననం మరణం పొందుతూ తమ మూలాలను మరచి , కలియుగం లో వేరు వేరు ధర్మాలలో వివిధ దేశాల లో జన్మించారు .
తిరిగి ఈ కలియుగాంత సమయం లో , శివుడు అవతరించిన ఈ సంగమ యుగం లో , వారంతా తాము పూర్వజులం అనగా ఎన్నో జన్మలు ఎత్తిన వారం అనే విషయాన్ని శివ శక్తి ద్వారా అనేక ఆధారభరిత అనుభవాలను వారు స్వయం గా పొంది , ఒకప్పుడు తాము ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారము అని తెలుసుకుని నేడు , భారత దేశం లో ఉన్న ఉన్న శివుని ఆలయాలకు , ఆశ్రమాలకు చేరుకుంటారు . . . చేరు కుంటున్నారు .
• శివుడే స్వయంగా గీతా జ్ఞానం ద్వారా, నా మనసు లోని ఈ సందేహానికి సత్యమైన సమాధానం ఆధారంతో చూపిస్తూ తెలియచేయడం జరిగింది .
ఇలాంటి అనుభవాలు ఎన్నో. . . అందుకే శివుని తో ప్రయాణం అత్యద్భుతం. అది అనేక భవిష్య జన్మలకు కావలసిన భోగ భాగ్యం.
శివుడు అంటే ఒక విశ్వ మహ శక్తి . అంతే కానీ ప్రత్యేకంగా ఒక మతానికి పరిమితం అయిన వాడు కాదు . ఇటీవల ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో , ఇరాన్ ప్రజలు శివుని పూజించడం, ప్రార్థనలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో లింక్ 👇👇 . వేల సంవత్సరాల క్రితం , ఆ యా దేశాలలో వారు ఉపయోగించిన నాణేల పై శివలింగం ఉండడం గమనించవచ్చు.
• నేను “ఒంటరిని” కాను అని ఈ సమాజానికి ఎలా చెప్పాలి అని నేను “ఒంటరిగా” కూర్చొని ఆలోచిస్తున్నాను . బాల్యం లో ఒంటరితనం అనే బీజం బాధించేందుకే అనిపించినా, అది బ్రతుకు బంగారు బాట కోసం అని శివుని తత్వం తో అనుభవం అయింది . భగవంతుని రచన (script) అమోఘం . ఆ మూలాన్ని అర్దం చేసుకోవడం అసాధారణం . స్వయం భగవంతుడే వచ్చి అర్దం చేయించినపుడే అది తెలుస్తుంది .
• నేను ఒంటరిని కాను . అనేక జన్మల కొరకు నాకంటూ ఒక శాశ్వతమైన తోడు నీడ కలిగి ఉన్నాను . ఆ తోడు తోనే జీవిస్తున్నాను , ఆ నీడలోనే నడుస్తున్నాను . . . ఒకోసారి , నువ్వు భగవంతుడు అనే భ్రమ లో (లోకం భాష లో పిచ్చి) ఉన్నావు , అని నా చుట్టూ ఉన్న మాయ నాకు గుర్తు చేసిన క్షణం లోనే , ఏదో అసాధారణమైన శక్తి తో అద్భుతాలను నాకు అందిస్తూ , ఆ మాయా భ్రమ లకు తెర దించుతూ, చీకటిని మరింత తొలగించి స్పష్టం గా చూపిస్తూ , వాటిని చవిచూసేలా చేస్తూ , నేను నీతో ఉన్నాను అంటాడు శివుడు . ఇంతకు మించి ఏం కావాలి.
• కాలం లో కలం ఒకోసారి కలకలం సృష్టిస్తోందా అనిపిస్తుంది. జీవితం లో ముగింపు లేని కథలకు , వాటి పాత్రలతో నాకు పని ఏంటి ? అలాగని నన్ను నేను తీరం చేరని కెరటం అనుకోలేను కదా? నా ప్రయాణం సంద్రమైనా తీరం చేరడం నాకు ముఖ్యం కదా!
• నేను మనసుతో నవ్వితే సమాజం నన్ను వెర్రి అనుకుంటుంది , మౌనం గా ఉంటే బ్రతకడం చాత కాదు అంటుంది , కానీ నా ఆనందం నాలోనే నాతోనే .
నేను నలుగురిలో ఉంటే ఇబ్బంది పడుతున్నాను అని సమాజం ఈ మధ్య అంటుంది . అవును , ఇబ్బంది పెడితే ఎవరైనా ఇబ్బంది పడతారు కదా ! ఆ మాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా , ఆ నలుగురి తో ఉన్న ఈ సమాజం ఎలా ఎదిగింది ? అజ్ఞానం కాకపోతే . అందుకే ఒకోసారి సమాజాన్ని చూసి జాలేస్తుంది , పాపం సత్యాన్ని ఎదుర్కొ లేక మాయ తో కలిసి వంకర గా నడుస్తుంది అని.
ఇది నిజం , ఇదే నా నైజం . . .
• నాకు కనబడదని గాలిని , నేను చూడలేదని అదృష్టాన్ని నమ్మను అంటే కుదురుతుందా ? కలానికి కాలానికీ తలవంచని మనిషి లేడు కదా ! ఒక్కోసారి ఆలస్యం అమృతంగా మారుగాక. . అయినా గరళాన్ని మింగేవాడికి రంగు రుచి వాసనలతో పని ఏంటి ?
• అప్పుడప్పుడు పదాలకు దూరమయ్యేనేమో గానీ , నా శివుని పాదాలకు మాత్రం కాదు.
ఒక్కోసారి వాంఛితములు వంచనలకు గురికావలసిందే. నాకు వద్దూ అంటే చెవిలో దూరిన జోరీగ నిశ్శబ్దంగా ఉంటుందా ? అదే విధంగా కొన్ని మాయా సాంగత్యాలను కర్మ బుణానుసారం భరించవలసి వచ్చేది . బుణాలు తీరాయి . శాశ్వత విముక్తి లభించింది .
• నాలోని ప్రతి భావము పదరూపము పొందాలంటే అది శివానుగ్రహానికి నోచుకోవాలి కదా ! . . . . . . లేదు లేదు, నాకు ఆ అధికారం ఉంది కదా అని , అడిగిన వారి కోసం విర్రవీగితే పద సోపానాలు తుల్యమై చివరకు శల్యమై పోవుగా .
• “నా” అన్న భావన “నమః శివాయః” లోని “న” నుండి వచ్చినదైతే నా లోని “న” నన్ను ఎప్పుడూ ఉచ్చ స్థితిలో నిలబెడుతుంది. కారణం అది నిర్వికారి నిగర్వి నిరాకార నిర్గుణ తత్వాలని కలిగి ఉంటుంది కాబట్టి . లేదంటే , “ నా “ నాలోని సర్వ గుణముల కలయికయై నన్ను అహంకార భూషితుడను చేస్తుంది.
ప్రణవ నాదమైన ఓంకార శబ్దం శరీరం లో అణువణువునా ప్రతిధ్వనిస్తే ఆ తరంగ “అంతరంగ” మధురానుభూతులు వెల్లువలా పొంగి పద ప్రాసలుగా మారి పరవళ్ళు తొక్కు ప్రవాహాలుగా పొర్లుతాయి. ఇదే శివలీల. శివ కణములు లేని శివ గణములు ఉండునా ?
• నేను ఇంతకు ముందు విన్నవించినట్లు , మండినా మారనది , తుదకు మిగిలేది వెలకట్టలేనిది “విభూది” అదే ఐశ్వర్యం . నువ్వు విభూదిగా మారక మునుపే దాని విలువ తెలుసుకో తరువాత తెలుసుకోవడానికి ఏమీ మిగలదు , మరల విభూది తప్ప.
విరక్తి లోని రక్తి అద్బుతం . వైరాగ్యం లోని రాగం సమ్మోహనం .
• చివరిగా ! శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా , ఆ “చీమ” నన్ను ఎప్పుడు కుడుతుందా అని శూన్యం లోకి ఎదురుచూస్తూ ...
• ఒకసారి శ్రీకృష్ణుడు , పాండవుల కు సృష్టి మరియ యుగాల గురించి ఉపదేశిస్తూ కలియుగం ఆరంభం గురించి వివరించగా , పాండవులు కలియుగ అంతం గురించి తెలియ చేయమని అడగడం జరిగింది .
వెంటనే , శ్రీ కృష్ణుడు కలియుగ అంత్య సమయం ఎలా ఉంటుందో వివరించడం కంటే ముందు , తన శక్తి తో అది స్వయం గా వారికి చూపించాలని నిర్ణయించుకొని , పాండవులకు ఒక పరీక్ష పెడతాడు . ఆ పరీక్ష లో ధర్మరాజు ను మినహాయించి . . . తన వద్ద ఉన్న నాలుగు బాణాలు తీసి , నాలుగు దిక్కుల వైపుకు వేసి అవి తీసుకుని రమ్మని అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు కి చెపుతాడు .
వారు నలుగురు తలో దిక్కు కు వెళతారు .
• అర్జునుడు తాను వెళ్లిన దిక్కు లో దొరికిన బాణం తీసుకుని వస్తుండగా , ఒకచోట ఒక విచిత్రం చూస్తాడు. అప్పుడే దూడకు జన్మనిచ్చిన ఆవు, అదే పనిగా దూడను విపరీతంగా నాకుతూ ఉంటుంది. ఆ దూడను ఎంతకూ వదిలి పెట్టదు . అక్కడ ఉన్న వారు, ఆవు ను బలవంతంగా దూరం గా ఉంచినా సరే పరిగెత్తుకుంటూ ఆవు , దూడ దగ్గర కు వెళ్లి నాకుతూ ఉంటుంది . ఇది అర్జునుడికి చాలా ఆశ్చర్యం గా అనిపిస్తుంది . అది చూసి అర్జునుడు బయలుదేరుతాడు.
• ఇక రెండవ దిక్కు నుండి భీముడు బాణం తీసుకుని వస్తూ ఉంటే , ఆ మార్గంలో ఒక కోకిల బ్రతికి ఉన్న కుందేలు ను పొడుచుకుని తింటూ ఉంటుంది . భీముడు ఆశ్చర్యపోతాడు కోకిల ఎంతో మృధువైనది. ఎంతో మృదువుగా రాగం ఆలపిస్తుంది . అటువంటిది , కుందేలు ను పొడుచుకుని ఆహారం గా తినడం ఏమిటి . ఏమిటి ఈ విపరీతం అని, సందేహం తో భీముడు అక్కడి నుంచి బయలుదేరుతాడు .
• ఇక మూడవ దిక్కు నుంచి నకులుడు బాణం తీసుకుని తిరిగి వస్తుండగా , ఒక చోట వింత చూస్తాడు . ఒక పెద్ద బావి , దాని సమీపంలో నాలుగు చిన్న బావులు ఉంటాయి . కేవలం పెద్ద బావి లో మాత్రమే నీళ్ళు ఉండడం వలన , అక్కడి ప్రజలు నీళ్ళు తోడి చుట్టూ ఉన్న నాలుగు చిన్న బావుల్లో సమానం గా నింపుతూ ఉంటారు . కొంత సమయానికి పెద్ద బావి లో నీళ్ళు పూర్తిగా నిండుకుంటాయి . వెంటనే అక్కడి ప్రజలు, అయ్యయ్యో పెద్ద బావి లో కొన్ని నీళ్ళు అయినా ఉండాలి కదా అని , చుట్టూ ఉన్న నాలుగు బావుల లో ఇది వరకు వేసిన కొన్ని నీళ్ళు కొంచెం కొంచెం తోడి పెద్ద బావి లో వెయ్యాలని ప్రయత్నిస్తే , ఆ నాలుగు చిన్న బావుల లోని నీళ్ళు తోడే సరికే , అవి ఆవిరి అయిపోతుంటాయి . కానీ పెద్ద బావి కి ఒక్క నీటి చుక్క కూడా దొరకదు .
అది చూసిన నకులుడు ఏంటి ఈ విచిత్రం కళ్ళ ముందే ఇలా జరుగుతుంది అని అనుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు .
• ఇక నాల్గవ దిక్కు న ఉన్న బాణం సేకరించిన సహదేవుడు తనకు దొరికిన బాణం తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరుతుండగా , ఒక విచిత్రం చూస్తాడు . ఒక పెద్ద బండరాయి , మహా పర్వతం పై నుంచి, దొర్లుకుంటూ వస్తుంది. అది అలా దొర్లుకుంటూ వచ్చేటప్పుడూ ఎంతో ఏపుగా ఆ పర్వతం పై పెరిగిన మహ వృక్షాలను కూలదోస్తూ , దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి ఆఖరికి ఒక చిన్న గడ్డిపోచను అడ్డుకొని పర్వతం మధ్యలో ఆగి పోతుంది . సహదేవుడు కి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంత పెద్ద బండరాయి చిన్న గడ్డిపోచను ఆనుకొని ఆగిపోవడం ఏమిటి . ఏమిటి ఈ విచిత్రం అని అనుకుంటూ అక్కడ నుంచి బయలు దేరుతాడు .
• ఆ నలుగురు శ్రీకృష్ణుని చేరి , తాము చూసిన వింత అనుభవాలు వివరిస్తారు . అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెపుతాడు . కలియుగం చివరిలో అంతం అవుతుంది అనడానికి అవే సంకేతాలు . . వాటిలోని సూక్ష్మం మీకు అర్దం చేయిస్తాను అని , శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ఆరంభిస్తాడు .
• మొదటి వృత్తాంతం ఆవు , దూడను నాకుతూ ఉండడం. . . కలియుగం అంత్య కాల సమయం లో జన్మ నిచ్చన తల్లి తండ్రులు తమ పిల్లలకు అతి గా ప్రేమ ను పంచుతూ , సాకుతూ ఉంటారు . పిల్లలకు కష్టం తెలియకుండా సమస్తం సమకూరుస్తూ , మమకారం అనే మైకంలో పిల్లలకు , తల్లిదండ్రులు బానిసలు లా ప్రవర్తిస్తూ ఉంటారు . కష్టం తెలియని పిల్లలు సోమరులై , అపసవ్య దిశలో జీవనం సాగిస్తారు . అందుకు నిదర్శనం ఆ ఆవు దూడ వృత్తాంతం అని శ్రీకృష్ణుడు చెపుతాడు. వాస్తవానికి దూడ ఆవు గర్భం నుంచి భూమిపై పడిన కొన్ని క్షణాలలో తనకు తాను లేచి పరిగెట్టాలి , ఇది సృష్టి ధర్మం. కానీ సృష్టి ధర్మం తప్పి నపుడు జీవులకు అదే వినాశన కాలం అని చెపుతాడు .
• ఇక రెండవ అంశం అయిన కోయిల కుందేలు వృత్తాంతం గురించి చెపుతూ. . . సృష్టి లో కోయిల స్వరం భగవంతుని ఆశీర్వాదం . ఆ విధంగా కోయిల వలే , దైవానుగ్రహం తో సంపాదించిన జ్ఞానాన్ని కలిగి ఉన్న పండిత పుంగవులు తమ గొంతు, స్వరం , మాటలతో , కుందేలు వంటి అమాయకులను ధనం కోసం పీల్చి పిప్పి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు . విద్య , వైద్య , దైవీ జ్ఞానం వంటివి అనుభవజ్ఞులు కు , పండితులకు , గురువులకు లోక కళ్యాణార్దం భగవంతుని అనుగ్రహం చేత లభిస్తుంది . కానీ , ధనం కోసం తమ జ్ఞానాన్ని భ్రష్టు పట్టించి అమాయకులను పీడిస్తారు. అందుకు ఉదంతమే కోయిల , కుందేలు పట్ల ప్రవర్తన అని శ్రీకృష్ణుడు చెపుతాడు.
• ఇక ముడవ అంశం . . . అతి పెద్ద బావి వలే విశాల హృదయం ఉన్న తల్లి తండ్రులు ఉమ్మడి కుటుంబం లోని తమ పిల్లలందరికీ సమానంగా కావలసినంత ప్రేమ సహయ సహకారాలు అందిస్తారు . కలియుగ అంతం లో ఈ ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి , వృద్ధాప్యం లో ఉన్న తల్లి తండ్రులకు తమ పిల్లలు కడివెడు ప్రేమను కూడా పంచరు సరికదా అనాధల వలే చూస్తారు. అందుకే చిన్న బావుల్లో నీరు పెద్ద బావి కి చేరలేదు .
• ఇక నాల్గవ అంశం బండరాయి గడ్డిపోచ . . . కలియుగం లో భగవంతునికి కోసం ఎన్నో వ్యయ ప్రయాసలతో ఆలయాలు నిర్మించి , అంగరంగ వైభవంగా విగ్రహాలు తయారు చేయించి ఆలయాలకు సమర్పించిన వారికి కూడా సర్వ శక్తివంతుడు అయిన భగవంతుడు , పరమాత్ముడు అనుభవం కాడు . కారణం ఆడంబరాలు అలంకారాలు , మాయా ఆకర్షణల తో చేసే భక్తి భగవంతుని కి అణువంత కూడా ప్రీతి పాత్రం కాదు . ఆ విధమైన వాటన్నింటినీ దాటుకుని . . . భగవంతుని పై సత్యమైన ప్రేమ , మనసు కలిగి ఉన్న గడ్డిపోచ వంటి అమాయకుని చెంతకు స్వయం గా పరమాత్ముడే వెళతాడు . నిష్కల్మషమంటి నిరుపేదదైన మనసు లోనే భగవంతుడు ఆసీనుడు అవుతాడు . దాని ఉదంతమే బండరాయి వలే శక్తి వంతమైన పరమాత్మ , గడ్డి పోచ ను ఆనుకొని ఉండడం అని శ్రీకృష్ణుడు పాండవుల కు చెపుతాడు.
సేకరణ : గీతా జ్ఞానం - రాజయోగం .
• శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సందర్భాలు నేడు జరుగుతున్నాయో లేదో , ఇది కలియుగ అంత్య సమయమో కాదో నేటి కాలంలో మనిషే గ్రహించాలి . . . లేదంటే ఇంకా కలియుగం ప్రధమ పాదే , జంబూ ద్వీపే , భరతఖండే , భరతవర్షే , అంటూ నామ గోత్రాలు జపిస్తూ , ఇంకా కలియుగం ప్రధమ పాదం లో ఉన్నాం అనుకుని అమాయకత్వం తో ఉండవలసి వస్తుంది.
• Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet KETU .
• సరిగా ఆలోచిస్తే సమస్యలను మనమే సృష్టించుకున్నాము . అవును మనం ఒక విషయాన్ని సమస్య గా భావిస్తుంటే, ఆ సమస్య కి మూల కారణం మనమే . అది తెలియక తరచూ ఇతరులను నిందించడం జరుగుతుంది .
• సమస్య ను విశ్లేషించుకునే మానసిక శక్తి , అవగాహన లోపించినపుడు దానికి కారణం తరచూ ఇతరులు గా భావించడం జరుగుతుంది . వాస్తవానికి సమస్య మనది కాబట్టి కారణం కూడా మనమే . మనకు ఉన్న ఆలోచనా లేమి తో సమస్య ను సృష్టించుకునేందుకు మనమే అవకాశం ఇస్తాము లేదా ఇతరులకు ఆ అవకాశం మనమే స్వయంగా కల్పిస్తాము .
• సమస్యను ఎప్పుడూ బాహ్య దృష్టి తో కంటే , అంతర్దృష్టి తో చూసి నపుడు , ఏ దశలో మనము తప్పు చేశాము లేదా సరియైన నిర్ణయం తీసుకోలేక పోయాము లేదా సరియైన విధంగా ప్రవర్తించ లేకపోయాము అనేది మనకు మాత్రమే తెలుస్తుంది . దీనికి కాస్త ఆత్మ శుద్ది అవసరం . ఆత్మ శుద్ది లేని నాడు మన సమస్యలకు సమాధానం గాని, పరిష్కారం గాని పొందలేము .
• నేను కరెక్ట్ అనే భావన ద్వారా సరళత ఉన్న వారికి ఎన్నడూ తమకు సంబంధించిన ఏ విషయం పైన మనసు లో కించిత్ బాధ, దుఃఖం సహజంగా కూడా అనుభవించరు . ఎందుకంటే వారు తమ విషయాలనే కాదు ఎవరి విషయాలను కూడా సమస్యాత్మకంగా చూడరు, సమస్యను అనుభవం పొందరు . ఒకవేళ వారికి సమస్య ఉన్నా లేనట్లే ఉంటారు. కానీ, ఇందులో ఒకవేళ అహంకారం నిండి ఉంటే తమను తామే పాతాళానికి చేర్చుకునే ప్రయాణం అవుతుంది.
• వాస్తవానికి కొన్ని సార్లు, మనకు ఏ విధమైన సమస్యలు లేక పోయినా సరే , సమస్యలను అధికం గా ఫీల్ అవుతూ ఉంటాం . ఇది ఒక మానసిక మైన రోగం, బలహీనత.
• మనలో మంచి గుణాలు లేనపుడు తప్పని సరిగా ఏదో విధంగా , ఏదో రూపంలో ఇతరులు మనకు గుణపాఠం నేర్పిస్తారు . ఈ విషయం గ్రహించిన నాడు మనం మేలు పొందిన వారమే అవుతాం . కర్మ పాఠాలు, గుణ పాఠాలు నేర్చుకోవడానికి మన జీవితంలోని కాలం మనకు ఏదో ఒక వయసు లో , ఏదో ఒక సమయంలో అవకాశాన్ని ఇస్తుంది . అది సద్వినియోగం చేసుకున్న వారు భాగ్యవంతులు . కానీ ఇక్కడే ఒక సమస్య . . . అనేక కాలాలు గా మనిషి బుద్ధి బురదలో దొర్లి దొర్లి ఉండడం వలన , పాత సంస్కారాలు పాత ఆలోచనలు కి అలవాటు పడి పోయి ఉండడం వలన . . . గుణ పాఠాలు ఎదురైనా సరే తిరిగి బురదలో దొర్లాడే జీవి లా జీవించాలి అని అనిపిస్తుంది . ఇటువంటి వారిని మాయా జీవులు అంటారు. అంటే మాయ కు, కొన్నిరకాల బలహీనతలకు పూర్తిగా వశం అయిపోయిన వారు అని అంటారు .
• మన అంతరంగం పరిణితి చెంది ఉన్నంతలో , సాధించేది ఏమీ లేదు. పరిణితి తో పాటు దృఢత్వం అత్యంత అవసరం . ఈ దృఢత్వం సరియైన నియమాలు తో కూడిన నిర్ణయాలను ధైర్యం గా తీసుకునేందుకు సహకరిస్తుంది .
• సమస్యలు అనుభవాన్ని పెంచడానికి , వాటిని పరిష్కారించు కొనే మార్గం తెలియచేయడానికి వస్తాయి . అంతే కానీ వాటిని తప్పించుకు తిరగడానికి కాదు . సమస్యలు అనేవి శాశ్వతంగా తీరిపోయేటివి కాదు . ఒకటి పోతే మరొకటి, మనిషి జీవించి ఉన్నంత వరకు ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి . వాటిని ఎదుర్కోవడం అనగా సమస్య పై యుద్ధం చేయడం , ఒక బుద్ధి హీనత.
అంత కంటే కూడా, సమస్యను అర్దం చేసుకోవడం అలవాటుగా చేసుకుంటే తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించవచ్చు . ఆ అనుభవం తో మన సమస్యలనే కాదు , ఇతరుల సమస్యలకు కూడా అలవోకగా పరిష్కారం చూపించవచ్చు. . . కానీ అందుకు ఓర్పు సహనం తో పాటు సత్యమైన విశాల హృదయం కావాలి .
• కొన్ని సార్లు కొన్ని సమస్యలకు మూలం సరియైన కమ్యూనికేషన్ లోపం , అవగాహన లోపం , స్పష్టత లో లోపం . ఈ కమ్యూనికేషన్ లో ఆలోచన , మాట , కర్మ ఉంటాయి . వీటిని నిజాయితీ గా ఆచరించనపుడు మాత్రమే , జరిగిన పొరపాట్లుకు , అనుభవిస్తున్న సమస్యల కు తిరిగి అవే ఆలోచనలు , మాట , కర్మ పరిష్కారం చూపిస్తాయి .
• మనిషి జీవించి ఉన్నంత వరకు సమస్యలు ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. అందులో అనుమానం లేదు. ఎందుకంటే మనకు తెలియని సత్యం ఏమిటంటే , ఈ కలికాలం లో మనిషి జీవించడమే ఒక పెద్ద సమస్య , దీనికి ఉన్నోడు లేనోడు అనే మినహాయింపు లేదు . ధనం తో అసలు సంబంధం లేదు. అనేక జన్మలు గా వికర్మలు చేసిన వారే కలియుగం లో జన్మలు తీసుకుంటారు . ఆ కర్మల ఫలితం పూర్తిగా అనుభవించి , శుద్ది కాబడిన వారు మాత్రమే తిరిగి రాబోయే సత్య యుగం లో దైవీక జన్మలు తీసుకుంటారు . . అవునన్నా కాదన్నా ఇదే సత్యం .
• భారతదేశం వేద భూమి, పుణ్య భూమి, కర్మ భూమి. ఇది జగమెరిగిన సత్యం. భగవత్ జ్ఞానం లో స్వస్తిక్ గుర్తులో సృష్టి రహస్యం దాగి ఉంది . అది నాలుగు యుగాల సంకేతం , సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం , కలి యుగం . ఈ నాలుగు యుగాలలో నే సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకొక్క యుగం 1250 సంవత్సరాలు. సృష్టి మొత్తం 5000 సంవత్సరాలు . దీనిని ఒక కల్పం అంటారు. ఇప్పటికే ఎన్నో కల్పాలు జరిగాయి. అందుకే సృష్టి చరిత్ర లక్షల సంవత్సరాలు అనే మాట శాస్త్రాలలో అంటుంటారు . ప్రస్తుత కాలం కలియుగం పూర్తిగా వినాశనం అయ్యే కాలం. ఆరంభం కూడా అయింది. అందుకు ఎన్నో నిదర్శనాలు ఉదాహరణలు నిత్యం చూడడం జరుగుతుంది.
క్రమేపీ సత్య యుగం ఆరంభం కూడా భరత ఖండము నుంచే ఆరంభం ఔతుంది.
• నిజం లో ప్రయాణించడం, నిజం తో కలిసి జీవించడం అసాధ్యం కాదు, కానీ అందుకు కావలసింది నిజాయితిని కలిగి ఉండాల్సిన అంతరంగం
ధనం ఉంటే గుణం చూడరు . అదే లేకుంటే పుట్టుమచ్చ నైనా రోగం లా చూపేందుకు వెనుకాడరు .