Wednesday, June 24, 2026

761. గురువు - జ్ఞానం మనిషి కి అవసరమా?


గురువు . . . జ్ఞానం మనిషి కి అవసరమా?



  గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః 

  గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై  శ్రీ గురవే నమః 


• భగవంతుడు   సృష్టించిన   విశ్వంలో  ఖగోళం అత్యంత  అద్బుతం . నక్షత్రాలు , ఉల్కలు, తోకచుక్కలు , పాలపుంతలు , నవ గ్రహాలు వాటి తో పాటు అనేక చిన్న చిన్న గ్రహాలు వేటికవే  ఒక విలక్షణమైన మహా శక్తిని సంతరించుకుని ఉన్నాయి . ఈ శక్తి ప్రభావం ఒకదాని  నుంచి  మరొక  దానిపై  పడుతూ విశ్వం అంతా  వ్యాపించి ఉంటుంది . 

• ఇక గ్రహాల విషయానికి వస్తే భూమి ఒక గ్రహం .‌ ఈ భూమి పై పడే విశ్వం యొక్క (గురుత్వాకర్షణ) శక్తి ప్రభావం వలన భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే , ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ సూర్యుడు చంద్రుడు మరియు మిగిలిన గ్రహల చుట్టూ తిరుగుతుంది. ఇది సైన్స్ ద్వారా నేటి తరాలకు తెలిసిన వాస్తవం  . 

• భూమి విద్యుదయస్కాంత శక్తి కలిగి ఉండడం వలన  భూమి పై  నివసించే ప్రతి జీవి , నిర్జీవి , చెట్టు పుట్ట పక్షులు జంతువులు ఇవన్నీయు కూడా  విశ్వ శక్తి  ఆధారంగానే జీవిస్తాయి . 

 మనం విశ్వం లో ఒక భాగం. అంతే కానీ మనమే సమస్త విశ్వం కాదు . ఇదంతా  ఎందుకు అంటే , గ్రహాల యొక్క శక్తి ప్రభావం తప్పకుండా ఈ భూమి పై ఉన్న ప్రతి మానవుని పై ఉంటుంది . ఈ గుప్త విజ్ఞానాన్ని  జ్యోతిష శాస్త్రం లో  వేల సంవత్సరాల క్రితమే  పరాశర మహర్షి పొందుపరిచారు .


 జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ,  బృహస్పతి  Jupiter ఒక ప్రత్యేక గ్రహం . దీనిని  గురు గ్రహం అంటారు . నవ గ్రహాలలో గురు గ్రహాం అత్యంత ప్రాముఖ్యమైనది . అందుకే మనకు ఉన్న రోజులలో గురు వారం (లక్ష్మి వారం) ఒక విశిష్టత సంతరించుకున్నది . 


• ఒక ఆత్మ  , భూమి పైకి వచ్చి  శరీరం ధరించి  జన్మించినపుడు అది జీవాత్మ అవుతుంది . మనం జీవాత్మలం . జీవాత్మ  (మనిషి)  నివసించడానికి . . . జీవించడానికి అవసరమైన జీవన  విధాన శక్తి ని  ఇచ్చేది   గురు గ్రహం అయిన  బృహస్పతి . బృహస్పతి ని  దేవతలకే గురువు అంటారు . బృహస్పతి  జ్ఞానం మేధస్సుకు ప్రతీక . 


• ఒక మనిషి , జీవించడానికి కావలసిన అనుకూల  జ్ఞాన శక్తి, గురు గ్రహం  బృహస్పతి ద్వారా  విశ్వం నుంచి లభిస్తుంది .  జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనిషి కుండలినీ  లో   బృహస్పతి ,  గురుగ్రహ బలం ఎలా ఉందో గమనించి , ఆ మనిషి జీవిత నడవడిక జ్ఞాన  సంస్కార   విధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనిషి కి  బృహస్పతి  శక్తి  బలం గా  ఉంటే , ఏ విఘ్నాన్ని  అయినా ధైర్యం గా ఎదుర్కొని , సమస్య ను  పరిష్కరించుకునే జ్ఞానం , సామర్థ్యం  వ్యక్తి కలిగి ఉంటాడు .   గురు శక్తి బలహీనంగా  ఉంటే  అజ్ఞానంతో  సమస్యలు సృష్టించుకుంటూ , పాప కర్మలు చేస్తుంటాడు . గురు శక్తి తక్కువగా  ఉన్న వారికి  జీర్ణ కోశ సమస్యలు తరచూ వేధిస్తూ అధికంగా ఉంటాయి .

మానవుడు గత జన్మల లో చేసిన పాప పుణ్య కర్మలు, సంస్కారాల ఆధారం గా నేటి జన్మలో గురు గ్రహ బలం,  జీవన స్థితి ఆధారపడి ఉంటాయి . గ్రహాలు అన్ని కూడా  ఒకో విశిష్టత కలిగి ఉంటాయి . వాటి శక్తి , బలం బలహీనతల ప్రభావం వలనే మనిషి స్థితి గతి ఉంటుంది .  ఇందు ముఖ్యమైనది గురు గ్రహం , తద్వారా పొందే  జీవన జ్ఞానం , మేధస్సు  . 


🌹🌹🌹🌹🌹


• సాధారణంగా , ఈ భౌతిక ప్రపంచంలో గురువు అంటే పాఠాలు చెప్పే టీచరు అని , కాలేజిలో లెక్చరర్ అని , పి.హెచ్.డి. లో ప్రొఫెసర్ అని భావిస్తారు . కొందరు అయితే తమకు జీవనోపాధి వృత్తిని నేర్పించిన వారిని గురువు గా భావిస్తారు. ఈ విధంగా గౌరవించడం మంచిదే . కానీ వాస్తవానికి వీరెవరూ పరిపూర్ణత నిచ్చే గురువులు గా కాలేరు. 

  గురువు అంటే  జీవితానికి  సంపూర్ణ  మార్గదర్శి . పైన ఉదాహరించిన వారు  కేవలం చదువు లోను , వృత్తి లోను , వారికి తెలిసిన ఒక పరిమితి తో కూడిన విద్య ను  మాత్రమే బోధిస్తారు . వారు హద్దు లోని గురువులే కానీ జీవితానికి సంపూర్ణ  అనంతమైన మార్గదర్శకులు కారు. 


• మనిషి  జీవిత అంతిమ దశ  వరకు కావలసిన జ్ఞానాన్ని మార్గాన్ని  దిశను పైన ఉదహరించిన వారెవరూ చూపలేరు , అది కొంతవరకు ఆధ్యాత్మిక గురువు కి  సాధ్యం . . . అంతకు మించి సంపూర్ణ జ్ఞానం ఇవ్వగలిగిన వారు ఒక్క సద్గురువు మాత్రమే  . సద్గురువు అంటే  పరమాత్మ శివుడు , గీతా జ్ఞాన రచయిత . అందుకే శివుని నుంచి జ్ఞాన సాగరుడు అంటారు .

శరీరం ధరించి  ఉన్న , ఏ మానవమాత్రుడైనా గురువుగా అయి ఉండవచ్చు కానీ, అతడు సద్గురువు కాడు , కాలేడు .  సద్గురువు జనన మరణాలకు అతీతుడు. అతడే శివుడు.


• కలియుగం పూర్తి  పతిత ప్రపంచం, కలియుగం లో మానవ జన్మ తీసుకున్న ఏ మనిషి పవిత్రుడు కాడు   . ఎందుకంటే మానవుడు జన్మ తీసుకున్న విధి విధానం లోనే   విషయ వికారాల కర్మ  దాగి ఉంది .  అందుకనే ఓ పతిత పావన రండి అని భగవంతుడిని అందరూ పిలుస్తారు. దీని అర్థం పతితులు గా ఉన్న మమ్ము పావనం గా తయారు చేయండి అని. 

పవిత్రంగా పావనం గా కావలసింది దేహం ధరించిన వారి ఆత్మ .  ఆత్మ లోని  మనసు,  బుద్ధి , ఆలోచన , కర్మలు , సంస్కారాలు . అంతే కానీ శరీరం కాదు, మానవుని గా  జన్మించిన ఏ మనిషి శరీరం కూడా పవిత్రం కాదు, కాలేదు. 

కానీ శివుడు పరమ పవిత్రుడు , జనన మరణాలు కు  అతీతుడు . శివుడు జన్మించడు , అవతరిస్తాడు . పరమ పవిత్రుడైన  శివుడే  సద్గురువు . భక్తి మార్గం లో శివుని సద్గురువు గా  దక్షిణా మూర్తి గా కీర్తిస్తారు .

ఇదంతా  మానవ రూపంలో ఉన్న గురువు కి  , దైవ రూపం లో ఉన్న  సద్గురువు కి  మధ్య ఉన్న వ్యత్యాసం తెలియ చేయుట  కోసం మాత్రమే 


🌹🌹🌹🌹🌹


• ఒక మనిషి కుండలి లో బృహస్పతి, గురు బలం తక్కువ ఉన్న వారు తప్పని సరిగా గురువారం రోజున శివాలయం సందర్శించాలి . శివుని గురువు గా తలచి శివ స్మృతి  , శివ ధ్యానం చేయాలి . దక్షిణామూర్తి స్తోత్రం ఉదయం సాయంత్రం జపిస్తే గురు బలం (శక్తి) పెరుగుతుంది. దాన ధర్మాలు , హోమాలు జపాలు వలన ధనం వృధా చేసుకోవడం  మినహా ఏమీ ఉండదు . కొందరు తమ జీవన భృతి కోసం అవి చేయమని అనాదిగా చెపుతూ ఉంటారు ,  వీలైతే ఉడికించిన కేజీ శెనగలు, పావు కేజీ బెల్లం కలిపి ఆవుకి గురువారం రోజున తినిపించండి . 

కొందరు మనుషుల కి  ఉన్న  గ్రహల  బలం, శక్తి లోపం వలన కలిగే  ఈతిబాధలు  , సమస్యలు , బలహీనతలు, అనారోగ్యాలు , అజ్ఞానం  . . .  ఈ లోకంలో  మరికొంత మంది కి జీవన ఆధారం . ఇదే కలియుగం లోని మాయా దౌర్భాగ్యం .  

ఈ గ్రహల బలం, శక్తి లోపం మన లో ఏర్పడి ఉండడానికి కారణం,  గత జన్మల లో కానీ , నేటి జన్మలో కానీ తెలిసీ తెలియక  చేసిన పాప కర్మలు.  


• బృహస్పతి గురు బలం(శక్తి) నిండుగా ఉన్న వారి జీవితం మంచి నడవడిక ద్వారా సంపూర్ణత సాధిస్తుంది. వారు నిస్వార్థం గా తమకు తోచిన రీతిలో ఇతరులకు మేలు చేసే వారుగా ఉంటారు . వృత్తి రీత్యా  కొందరు , సేవ రీత్యా కొందరు గురువులు గా  అయి  ఉంటారు .

 జ్ఞానం  సూక్ష్మ  ధనం .  కంటికి కనపించదు.

 కరెన్సీ   స్థూల ధనం .   కంటికి కనిపిస్తుంది. 

స్థూల ధనం (కరెన్సీ) కలిగి  ఉన్నంతలో  జీవుడికి పరిపక్వత   సంపూర్ణత  మోక్ష సిద్ది  కలుగదు . జ్ఞానం  ఉన్న వారికి , స్థూల ధనం ధర్మం యుక్తంగా దానంతట అదే చేరుతుంది .


ఈ జన్మలో సంపాదించిన స్థూల ధనం (కరెన్సీ) మరు జన్మకు పనికిరాదు . 

కానీ, ఈ జన్మలో సంపాదించుకున్న జ్ఞాన ధనం అనేక జన్మల వరకు  నీ  ఆత్మతో కలిసి ఉంటుంది.


• నీ లోని సత్యాన్ని కొనుక్కొని , ఆ సత్యం తో పాపపుణ్యాలను  మరియు నీవు నిర్వర్తించ వలసిన బాధ్యత  ధర్మం తెలుసుకొని ఎలా జీవించాలి  అనేదే  జ్ఞానం యొక్క పరమార్థం . అంతే కానీ, జ్ఞానం అంటే శ్లోకాలు, పద్యాలు , కీర్తనలు , ఢాంభికాలు  , ఆడంబరాలతో కూడిన గంఢపేరుండాల వేషధారణ  ప్రదర్శించడం కాదు .

 సత్యమైన  జ్ఞాని ఎన్నడూ గుర్తింపు ఆశించడు. గుర్తింపే వెతుక్కుంటూ జ్ఞాని యొక్క పాదాల చెంతకు చేరుతుంది . గుర్తింపు అనేది మాయా ఆడంబరం, అదే జ్ఞాని పతనానికి మూలం. 

 జ్ఞాని నిరాడంబర జీవనం తో తన మనసు యొక్క శిఖరాన్ని అధిరోహించగలడు . ఆ శిఖరం పైనే పరమాత్మ శివుడు కొలువై ఉంటాడు . 

 జ్ఞానం , మానవుని  జీవిత నావను  పెను తుఫానుల నుంచి అత్యంత సులభంగా తీరం దాటిస్తుంది . జ్ఞానం తెలుసుకోవడమే కాకుండా ఆచరించడం ప్రధానం, ఆ జ్ఞానాన్ని ఇతరులకి పంచడమే  ఉత్తమ పురుషార్థి  లక్షణం  . 


గురు బలం ‌ సమృద్ధిగా ఉన్నవారు (knowledge) జ్ఞానం అర్జించగలరు.  అనగా తెలుసుకోగలరు .

జ్ఞానం మానవుని లోని  బుధ (Mercury బుద్ధి , తెలివి)  గ్రహ శక్తి ని  వృద్ధి చేస్తుంది .  తద్వారా   వివేకం  (wisdom)  పెరుగుతుంది . వివేకవంతుడు   ఏ సమయం లో ఎలా ప్రవర్తించాలో  , ఎలాంటి  నిర్ణయాలు తీసుకోవాలో  గురు జ్ఞానం తో   పొందిన విషయాలను  అనుభవాలు గా   మార్చుకుంటాడు. 

జ్ఞాని  మాత్రమే  వివేకి గా  మారగలడు .  గమనించ వలసిన విషయం జ్ఞానం (knowledge) వేరు , వివేకం (wisdom) వేరు .


నేటి కాలం  మానవుడు  అజ్ఞానం తో  ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు . దీనికి ప్రధాన కారణం  మనసు .  మనసు స్థిరత్వం లేకపోవడం వలన  భయం  ఆందోళన  అలజడి అభధ్రత పెరిగి  మానసిక రోగిగా  జీవించడం జరుగుతుంది. దీనికి కారణం సత్యం వాస్తవం తెలుసుకో లేకపోవడం .   ఇదే  అజ్ఞాన బీజం . 

ఒక నిస్వార్థమైన ఆధ్యాత్మిక గురువుని (ధనం ఆశించని , సేవా తత్పరుడు)   ఆశ్రయించడం వలన మనిషి కి  జ్ఞాన మార్గం   , జీవన మార్గదర్శకం లభిస్తుంది . కానీ ఈ మాయా లోకం లో అటువంటి సత్యమైన గురువులు  అరుదు గా ఉంటారు .  గురువు లభించక పోతే , మంచి  ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం ద్వారా కొంత  జీవన జ్ఞానాన్ని ఆర్జించ వచ్చు .

 

ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాలలో బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి సంబంధించిన సహజ రాజయోగ మెడిటేషన్ సెంటర్లు  అనేక వందలు ఉన్నాయి . పరమాత్మ శివుని యొక్క సంపూర్ణ గీతా జ్ఞానం ఈ సెంటర్లలో పూర్తి ఉచితంగా  , ఆయా  భాషలలో ప్రతీ రోజూ ఒక గంట సమయం చెపుతారు . శివుని జ్ఞానం తో పాటు ధ్యానం నేర్పిస్తారు .  సమీపం లో ఉన్న వారు , గురు బలం పెంచుకోవాలి అనుకునే వారు, సద్గురువు అయిన శివుని తో  ప్రత్యక్ష బంధం ఏర్పరచు కోవాలి అనుకునే వారు  , జీవితం లో మంచి మార్పు కోరుకునే వారు  తప్పకుండా సహజ రాజయోగ మెడిటేషన్  వినియోగించుకోవచ్చు . ఇది పూర్తిగా ఉచితం . 


ప్రతి మనిషి ఆనందంగా సంతోషంగా జీవించాలి అంటే , ముందు గా  తన గురించి తాను  తెలుసుకోవాలి. అందుకు తప్పని సరిగా  సత్యమైన నిస్వార్థమైన ఆధ్యాత్మిక గురువు అవసరం .  దేహదారి గురువు లేకుండా , సద్గురువు అయిన శివ పరమాత్మ ను చేరలేము. 

శివుని నిత్యం స్మృతి చేస్తూ ఉంటే , ఏదో నాడు తప్పక  సత్యమైన దేహదారీ  గురువు లభిస్తాడు  .


గురువులను కీర్తించక పోయినా , గౌరవించక పోయినా పర్వాలేదు కానీ పొరపాటు న  కూడా నిందించకూడదు .  అలా చేస్తే మహా పాపం తయారవుతుంది .


ఓ మనిషి . . .  ఈ  భౌతిక ప్రపంచంలో, నీవు సంతృప్తుడుగా  అయి  ,  నీ జీవిత నావ సజావుగా తీరం దాటాలి  అంటే తప్పని సరిగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న సత్యమైన , నిస్వార్థమైన  , నిరాడంబరమైన  గురువు యొక్క  జ్ఞానం  అవసరం . లేదంటే, ఈ లోకం అంతా విస్తరించి ఉన్న మాయ వలలో చిక్కుకుని మరెన్నో జన్మలు నిరాశ నిస్పృహ ల మధ్య కొట్టాడు తూ  జీవించ వలసి వస్తుంది .


• ఉన్నాడా    ఉన్నాడా 

  నీ కంటూ   ఓ గురువున్నాడా 

  మనిషి   ఓ  మనిషి . . . 


• గురువు  అంటే  దైవం 

  గురువు  అంటే  సన్మార్గం.

• గురువు  లేని   జీవితం 

  చుక్కాని  లేని   నావ పయనం .


  ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  ఓం శాంతి 

  ఓం నమఃశివాయ 🙏 

 యడ్ల శ్రీనివాసరావు 20 July 2026 , 10:15 PM.


760. అస్తికత్వం – నమ్మకం

 

అస్తికత్వం – నమ్మకం




• అస్తికత్వానికి  నాస్తికత్వానికి  తేడా కేవలం ఒక్క “నమ్మకం” మీదే ఆధారపడి ఉంటుంది. నిజానికి భగవంతుడు ఉన్నాడు అని నమ్మే  మనమందరూ కూడా అస్తికులమే  , కానీ పూర్తిగా కాదేమో ? ఒకసారి ఆలోచించండి.

ఎందుకంటే రోజువారి మనం చేసే కర్మలలో మంచితో పాటు చెడు లేదా తప్పుడు పనులు చేయటం కూడా జరుగుతుంది కదా! 


• కొన్ని సందర్భాలలో  మనం  తెలిసి , తప్పుడు పనుల చేసిన  సమయాలలో . . . మనకు భగవంతుడు ఉన్నాడు , మనలని గమనిస్తున్నాడు అనే ఆలోచన ,  జ్ఞప్తి  మన  స్పృహలో ఉంటుంది అనగలమా ?  ఒకవేళ ఉన్నా , మనం  జీవిస్తున్న లౌకిక విధానం లో తప్పుడు పనులు చేయడం సాధారణం , సహజం , ఆమోదయోగ్యమే  అని ఊరుకుంటూ  సరిపెట్టుకోగలమా ? 

 మన నమ్మకం ఆయా తప్పుడు పనులు చేస్తున్న సమయాలలో సందర్బాలలో ఏమైనట్టు ? లేక సమయానుకూలంగా భగవంతుని పై నమ్మకం మారుతుందా? అటువంటి పనులు చేసే సమయంలో భగవంతుడు గుర్తుకు రాడేమో కదా ! . . . దీనినే మనలో మాయ ఆవహించి ఉండడం అంటారు .


• భగవంతుని పై నమ్మకం అనేది కొంత భక్తితో కూడుకున్నప్పటికీ  ఎక్కువ మొత్తంలో భయంతో , అవసరాలతో , కోరికలతో , దుఃఖం భరించలేక కలుగుతుంది అనుకోవాలేమో  కదా !


• లోక కళ్యాణార్దం జన్మించిన రమణ మహర్షి , ఆది శంకరాచార్యులు , బ్రహ్మ బాబా, యోగానంద పరమానంద వంటి  సర్వసంగ పరిత్యాగుల నమ్మకాలు భగవంతుని పై పూర్తి గా వేరు కదా! 

• భయంతో , కోరికలతో , అవసరాల కోసం భక్తి చేస్తే భగవంతుని సమీపం , చేరుట సాధ్యమా? . . . భయం నిన్ను ఎక్కడో దూరంగా నిలబెట్టి కొలిచేలా చేస్తుంది కదా !  

• నీ కోరికలు , అవసరాలు కోసం భగవంతుని తో నీవు నిర్వహించే వ్యాపార బేరసారాలు . నిన్ను దళారి వలే  భగవంతుడి గడప బయట ‌ఉంచేలా చేస్తున్నాయోమో , కాస్త ఆలోచించి చూడు !

• భక్తి పాలు లో , నీ ప్రేమ ను చక్కెర గా కలిపితే భగవంతుని సమీపానికి వెళ్లగలుగుతావేమో ? ఆలోచించు . 


• భయం తో కూడిన భక్తి , మనిషి ని భగవంతునికి దూరం గా ఉంచే లా ఎందుకు చేస్తుంది ? . . . ఈ భయానికి కారణం , ఒకవైపు చేసి చేస్తున్న తప్పుడు పనుల ప్రభావం , ఆలోచనల లోని అపవిత్రత కాదని అనగలమా ! నీ మనస్సాక్షి కి తగిన ధైర్యం లేక భగవంతుడు అంటే భయపడుతుందేమో  ? ఎందుకంటే చేసిన ప్రతి పని భగవంతుడికి ఎరుక కాబట్టి .


• ప్రేమతో కూడిన భక్తి , భగవంతుని హృదయం లో స్థానం పొందేలా చేస్తుంది . బహుశా ఈ ప్రేమ పుట్టడానికి కారణం తన్మయత్వం . అంతర్దృష్టి మరియు మనసు లో నెలకొన్న బుద్ధి ఆలోచనల శుభ్రతయే  . . . కాదని అనగలమా ! 

 ఇవి . . ‌ నా మాటలు కాదు , ఎందరో మహానుభావుల నోట పలికిన ముత్యాల మూట.

ఏమంటే . . . సృష్టి లో ఒక అతీంద్రియ శక్తి ఉన్నది అదే మన అందరినీ నడిపిస్తోంది , అనే  సత్యం నమ్మడం ‌. ఇదే అస్తికత్వానికి ప్రామాణికమైతే మనమందరం భగవత్ ప్రియులం  . 

 కానీ,  ఈ సత్యాన్ని తెలుసుకునేది  ఎందరో ? సత్యాన్ని నమ్మేది మరెందరో ?  సత్యాన్ని  నోటితో పలికేది ఇంకెందరో ? . . . ఈ విషయం పైన ఉన్న భగవంతుడికి తెలియాలి , లేదా మనలో ఉన్న మాయ కి తెలియాలి .


సత్యమేవ జయతే!


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 23 June 2926 , 11:00 AM.

Thursday, June 18, 2026

759. ఎల్లి పోతున్నదే నా నావ

 

ఎల్లి   పోతున్న దే  నా నావ 


• ఎల్లి   పోతున్న దే    నా  నావ 

  మల్లి  . . .   ఎల్లి   పోతున్న దే   నా  నావ.


• గింగురల  గాలి  లో …. 

  గింగురల  గాలి  లో 

  రింగు   రింగులు     తిరుగుతూ   

• ఎల్లి   పోతున్న దే   నా  నావ 

  మల్లి . . .  ఎల్లి   పోతున్న దే   నా నావ.


• కారు   మబ్బు   కమ్మిట్లో 

  చెదురు  మదురు  సినుకుల లో 

  ఉరుకు   పరుగు లెట్టా  నే . . . 

• గోదారి   రేవు కే    చేరా నే  . . .   మల్లి 

  మల్లీ . . . గోదారి   రేవు కే   చేరా నే. 


  కానీ  . . . ఏం   లాభం.


• ఎల్లి   పోతున్న దే   నా నావ 

  మల్లి . ‌ .  ఎల్లి  పోతున్న దే  నా నావ.


• నాటు  పడవ   పోటుగాడు 

  నాటు   పడవ   పోటుగాడు 

• నన్ను   సూసి 

  రమ్మని  సేయి  ఊపినాడు . . . 

• ఉరుకు    దామనుకుంటే 

  ఆ  . . .  ఉరుకు   దామనుకుంటే 

• గోదారి   గల గల  లే 

  ఈ గోదారి  గల గల లే 

  భయపెట్టి   ఆపినాయి .

పొద్దు  కూకుల  నను  రేవు లో 

   కూసో   బెట్టి   నాయి . 


• ఈదురు   గాలులతో 

  సినుకుల    గోలలతో

  అలల     ఉరుకుల తో 

  పున్నమి  యెన్నెల  తో 

  ఏదో  . . . ‌ భయమయితిందే   మల్లి 

  నాలో  ఏదో . . .  భయమయితిందే   మల్లి .


• ఎల్లి   పోతున్న దే  నా  నావ 

  మల్లి  . . .  ఎల్లి  పోతున్న దే   నా నావ.


• గింగురల   గాలి లో …. 

  గింగురల   గాలి లో 

  రింగు    రింగులు      తిరుగుతూ   

• ఎల్లి   పోతున్న దే   నా  నావ 

  మల్లి  . . . ఎల్లి    పోతున్న దే    నా నావ.


🌹🌹🌹🌹🌹


ఈ రోజు సాయంత్రం సరస్వతి ఘూట్ (రేవు) లో వాకింగ్ చేస్తుంటే , అకస్మాత్తుగా ఈదురు గాలులు, చీకటి మబ్బులు, ఉరుములు మెరుపులతో సన్నగా చినుకులు ఆరంభమయ్యాయి.  వాతావరణం అంతా , ప్రకృతి పురి విప్పిన నెమలి లా నాట్యం చేస్తుందా ! అని అనిపించింది.  

అప్పుడే కొన్ని క్షణాల క్రితం రేవు లో  నుంచి ఒక నావ కొంతమంది తో బయలు దేరింది . వారంతా కూలీ పనులు చేసుకునే వారు. గోదావరి మధ్యలో ఉన్న లంకల్లో  (ఎత్తైన ఇసుక దిబ్బలు) ,  గుడిసెలు వేసుకొని  తమ కుటుంబాలతో నివసిస్తారు . వారు రోజు ఉదయం నావలో ఇటు రేవు లోకి (రాజమండ్రి) వచ్చి భవన నిర్మాణ కూలీ పనులు తదితరమైనవి చేసుకొని సాయంత్రం తిరిగి వెళ్ళి పోతారు . 

ఇంతలో ఒక వ్యక్తి పరుగు పరుగున ఆయాసపడుతూ నావ ఎక్కడం కోసం రేవు లోకి వచ్చాడు . కానీ అప్పటికే ఆ నావ కొంత దూరం వెళ్ళి పోయింది . పడవ నడిపే వాడు చేయి ఊపుతున్నాడు . ఈ వ్యక్తి చేసేది ఏమీ లేక రేవు లో కూర్చుని దిక్కులు చూస్తున్నాడు . 

ఆ సమయంలో ఒక వైపు హోరున భయంకరమైన గాలి,  మరోవైపు చీకటి పడుతూ ఉండడం , సన్నగా వర్షం , ఆ నావ గాలికి ఊగడం , అందులోని వారు తడిచి పోవడం , ఈ వ్యక్తి నావ దొరకలేదని నిరాశ గా నిలబడడం , అదంతా మనసు తో చూస్తుంటే ప్రకృతి  ఏదో చెపుతుంది అనిపించింది .  

ఆ భావాలే ఈ జానపదం . ప్రకృతి కలిగించిన అవకాశం . 

 . . . మనిషికి ప్రకృతి ద్వారా దొరికినంత ఆనందం ఈ సృష్టిలో ఎక్కడా దొరకదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి లోనే , పంచభూతాలు మరియు భగవంతుని శక్తి ఉండడమే ప్రధాన కారణం . ఎందుకంటే  మనిషి కూడా పంచభూతాలతోనే సృష్టించబడి  ఉన్నాడు కదా . . . 


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు  18 June 2026 5:30 PM.















Monday, June 15, 2026

758. నర్తనం

 

నర్తనం


• భావము లో    భాష్యం 

  గోవిందా    . . . గోవిందా 

• భావము లో    భాష్యం 

  గోవిందా    . . . గోవిందా .


• నడయాడే    నర్తకి   పాదము 

  పలకరించే  

  ధరణి   సంభూతము .

• నగుమోము న    దివ్య  తేజము 

  వికసించే     

  శ్రీరంగ    వైభవము .


• భావము లో      భాష్యం 

  గోవిందా     . . .   గోవిందా 

• భావము లో       భాష్యం 

  గోవిందా    . . .    గోవిందా .


• అభినయ   భంగిమ   చలనము లే

  కైలాసుని    నఖశిఖ    పర్యంతములు .

• కళల     కాణాచి   ఈ నర్తన మే 

  పార్వతి  సిగలో    పారిజాతము .


• గజ్జెలు  మోగే    నాదము లో 

  గమకము   లెన్నో   ఆడాయి . 

• సజ్జన    మేగే      నృత్యం లో 

  జీవము  లెన్నో     తరియించాయి .


• భావము లో     భాష్యం 

  గోవిందా   . . .   గోవిందా 

• భావము    లో    భాష్యం 

  గోవిందా    . . .   గోవిందా .


• నర్తనం     ఆవర్తనం     సంవర్తనం

  నర్తనం     సంకీర్తనం    పరివర్తనం 


• భావము లో     భాష్యం 

  గోవిందా   . . .   గోవిందా 

  గోవిందా   . . .   గోవిందా 

  గోవిందా   . . .   గోవిందా .



🌹🌹🌹🌹🌹


• భావము లోనే మూల సూత్రాలకు నిర్వచనం (భాష్యం) ఉంది . గోవిందా . . .  గోవిందా. 

• నాట్యం చేసె నర్తకి  పాదము తో ,  భూమి పుట్టుకను  పలకరించును .

• ముఖమున దైవ తేజస్సు , శ్రీరంగ నాధుని వైభవం వలే వికసిస్తుంది .

• అభినయం చేస్తున్న నృత్య భంగిమల కదలికలు శంకరుని పాదము నుంచి తల వరకు గల రూపములు .

• వంశ కుల ధర్మమైన ఈ కళా నృత్యం పారిజాత పుష్ప మై పార్వతి దేవి సిగ లో ఉండును .

• కాలి గజ్జెలు చేస్తున్న శబ్ధం లో స్వరాల సముదాయాలు ఎన్నో కలిసి ఆడాయి .

• అలంకార మైన ఈ నాట్యం వలన ఎన్నో జీవులు తరించాయి .

• నాట్యం పాఠం వలే వల్లే వేయు మంచి జీవన విధానము.

• నృత్యం  కధనము గా  విశ్వం లో  మార్పు సృష్టించును.



ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 15 June 2026 , 2:00 PM.




Sunday, June 14, 2026

757. శ్రీ మత్ భగవద్గీత

 

శ్రీ మత్  భగవద్గీత



• భగవద్గీత అంటే భగవంతుడు గీసిన గీత గా అభివర్ణించవచ్చు . సమస్త సృష్టి కి బీజ రూపుడు అయిన పరమాత్మ శివుడు , ఈ సృష్టి ని నడిపించడానికి , నియమ నిబంధనల తో కూడిన ధర్మాన్ని రచించాడు . ధర్మం అంటే సృష్టి కళ్యాణం కోసం నిర్మించిన ఆచరణాత్మక విధి విధానాలు , అందులో    ప్రకృతి   పంచభూతాలతో సహ  ప్రతి జీవి , ప్రతి ప్రాణి  కూడా ఒకటికి   మరొకటి సహకరించుకుంటూ, ఏ ఒక్కటీ మరొక దానికి హని కలిగించకుండా జీవించ వలసిన విధి విధానమే ప్రధానం .


• విశ్వానికి హద్దులు లేవు కానీ విశ్వం లో జీవించే ప్రతి జీవానికి హద్దులు పరిమితులు తప్పకుండా ఉన్నాయి . అవి తమ తమ ధర్మానుసారం  జీవించవలసిన అవసరం ఉంది. ఇదే భగవంతుని నియమం. ఇదంతా విశ్వ కళ్యాణం కోసం, ప్రతీ జీవి సుభిక్షంగా జీవించడం కోసం .

• అందుకే భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పండుగల్లో ప్రకృతి , పంచభూతాలు , చెట్టు , పుట్ట , పశువు ఇలా అన్నింటిని గౌరవిస్తూ వాటిని పూజించేలా  అంతర్భాగంగా చేశారు . అవి మూఢనమ్మకాలు కానే కావు .  నేటి కాలం లోని అనేకులకు అందు  ఇమిడి ఉన్న శాస్త్రీయత , సూక్ష్మం, జ్ఞానం తెలియక పోవడం వలన  మూఢనమ్మకాలు గా భావిస్తుంటారు .


 శ్రీమత్ భగవద్గీత

 శ్రీ      =  శ్రేష్టమైన

 మత్  = సలహా

భగవద్గీత = పరమాత్మ ని రచన , భగవంతుని నిబంధన , భగవంతుడు గీసిన హద్దు గీత .


• శ్రీ మత్ భగవద్గీత అంటే శ్రేష్ఠమైన సలహాలతో మానవుని కోసం శివ పరమాత్ముడి సృష్టించిన నియమ నిబంధన . ఆ  నిబంధనలను మనిషి దాటకుండా ఉండడానికి  భగవంతుడు గీసిన గీత గా భగవద్గీత ను  అభివర్ణించవచ్చు . (శివుని యొక్క ఈ  గీతా రచనను , సత్య యుగపు రాకుమారుడు అయిన శ్రీకృష్ణుడు తన దివ్యత్వంతో లోక కళ్యాణార్దం భగవంతుని మాట గా అర్జునుడికి వినిపిస్తాడు . శ్రీకృష్ణుడు ఏ దశలో  కూడా నేనే స్వయం భగవంతుడుని అని చెప్పడు ,  భగవానువాచ అని మాత్రమే చెప్తాడు . అంటే దాని అర్థం భగవంతుడు ఇలా చెప్పాడు అని భగవంతుని దివ్య వాణి ని  శ్రీకృష్ణుడు  వినిపిస్తాడు. భగవంతుడు ఒక్కడే అతడే శివుడు, పరమాత్ముడు)


• ఈ సృష్టిలో అన్ని జీవులు , ప్రాణుల కంటే మానవుడు ఒక ప్రత్యేకం. బుద్ధి, వివేకం , ఆలోచన, జ్ఞానం వంటి లక్షణాలు కేవలం మనిషి కి మాత్రమే ఇవ్వబడ్డాయి. ఒక మనిషి మరొక మనిషికీ అపకారం తలపెట్టిన నాడే ఈ సమస్త సృష్టి అదుపు తప్పుతుంది . వినాశనం వైపు అడుగులు వేస్తుంది . ప్రత్యక్షం గా ప్రస్తుత కాలంలో వంద శాతం జరుగుతున్నది అదే .


 ఈ సృష్టిలో కాలం మొత్తం సత్య , త్రేతా , ద్వాపర , కలి , ఈ నాలుగు యుగాలలో నే తిరుగుతుంది . ( Repeated cycle )


• సత్య యుగం లో ప్రతి జీవి , ప్రతి ప్రాణి , ప్రతి మనిషి భగవంతుని రచన ప్రకారమే జీవించేవి . అందుకే అక్కడ అమితమైన ఆనందం తప్ప దుఃఖం భాధ , అన్యాయం, మోసం అనే పదాలు, వాటి అర్థాలు, వాటి అనుభవాలు కూడా ఏ జీవికి తెలియవు . సత్య యుగం లో అవు పులి కలిసి ఆడుకుంటూ, ఒకే నదిలో నీరు తాగుతాయి . సత్య యుగం , ఆది సనాతన దేవి దేవతా ధర్మానుసారం , ధర్మం నాలుగు పాదాల లో నడుస్తుంది . సత్య యుగాన్ని బంగారు యుగం (Golden Age) అంటారు .


 కానీ కలియుగం లో  ధర్మం పూర్తిగా నశిస్తుంది. భగవద్గీత ను కేవలం ఒక గ్రంథం, పుస్తకం వలే చూడడానికి మినహా ఆచరణకు నోచుకోలేని స్థితిలో మనిషి జీవనం  దిగజారి ఉంటుంది . ఇదే భగవంతుడు గీసిన గీతను ఉల్లంఘించడం . అందువలన అశాంతి దుఃఖం హింస తో జన జీవనం నిండుతుంది . ఏ మానవమాత్రునికి ఇందు మినహాయింపు లేదు. కలియుగాన్ని ఇనుప యుగం (Iron Age) అంటారు . ఈర్ష్య ద్వేషం అసూయ కామం క్రోధం తో మానవ జన్మలు పూర్తి భ్రష్టు మయం అయి ఉంటాయి .

 దీనిని ఉదహరించే , రామాయణం లో ఒక మంచి విషయం చెప్పబడింది . సీత లక్ష్మణుడు గీసిన గీత ను దాటి నందుకు , రాక్షసుడైన రావణాసురుడు మాయా రూపం లో  అపహరిస్తాడు. దుఃఖం, కష్టం లో ఉన్న సీత రామునికై ఎదురు చూస్తుంది . . . 

దీని అర్థం భగవంతుడు  గీసిన గీత , నియమం ధర్మాన్ని కలియుగం లో ప్రతి మనిషి ఉల్లంఘించి దాటడం వలన కలియుగ మాయా  వికారాలలో చిక్కుకొని , వాటికి  వశం అయి , దుఃఖం అనారోగ్యం ఈతి భాధలతో విలవిలాడుతూ తిరిగి భగవంతుడిని రమ్మని ప్రార్థిస్తూ  , రక్షించమని ప్రాధేయపడతారు .


• జ్ఞాన యుక్తం తో అర్దం చేసుకోగలిగితే ,  మనిషి  జీవన రక్షణ కోసం రచించిన సత్యం , జీవన వేదమే భగవద్గీత . 

కురుక్షేత్రం అంటే ఎప్పడో జరిగిపోయిన యుద్ధం కాదు . కలియుగం లో భూమి పై ప్రతి మానవుడు మనసు తో అనుభవించే యుద్ధం. అందుకే అది మహా భారతం .  అందులో  కౌరవులు , పాండవులు ఇంకా  భారతంలో ఉన్న అనేక రకాల పాత్రలు పోషించేది నేడు ప్రత్యామ్నాయ రూపం లో మనమే.


శివుడు కల్పించిన అవగాహన కొద్దీ ✍️ .



రోహిణి  అమావాస్య  ప్రకాశం


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు. 14 June 2026 1:00 PM.


Friday, June 12, 2026

756 . హద్దు లేని ఆకాశం నీ ప్రేమ

 

హద్దు లేని  ఆకాశం  నీ  ప్రేమ



• హద్దు  లేని   ఆకాశం   నీ  ప్రేమ .

  హావభావాలు   ఎరుగకనే   చూపావు .

  ఆనందడోలికలలో   ముంచావు .


• హద్దు  లేని   ఆకాశం   నీ  ప్రేమ .


• వర్ణన కే    రాని   అమితం   ఈ అద్బుతం

  ఎన్ని   జన్మల    పుణ్యఫలం .


• నా    కంటనీరు   ఆరుద్రమై

  నీ   పాదము   చేరగా

  నా  హృదయం   తాకేవు .


• నీ  స్పర్శ  ఎరుగని   ఈ తనువు

  పుష్ప మై    ఊగుతూ   ఉంది .

• నా  మనసు     మైనమై

  మౌనం తో   నీ కై   సాగుతూ  ఉంది .


• హద్దు లేని   ఆకాశం    నీ ప్రేమ .

  హావభావాలు   ఎరుగకనే   చూపావు .

  ఆనందడోలికలలో   ముంచావు .


• శివ మనే   శబ్దం    సెలయే రై   సాగెను .

  నా మది లో   మైకాన్ని    శుద్ది   చేసెను .


• మర  జీవము లో    మహత్యమే

  సంజీవని గా     ఇచ్చావు .

• ముల్లోకాల నే    మకరందాలు

  జ్ఞానం తో    చూపావు .


• హద్దు లేని    ఆకాశం   నీ ప్రేమ .

  హావభావాలు   ఎరుగకనే   చూపావు .

  ఆనందడోలికలలో    ముంచావు .

  హద్దు లేని    ఆకాశం   నీ  ప్రేమ .



  హావభావాలు  =   శరీర  భావోద్వేగాలు 

  మర  జీవము =  జీవంలో  మరణ  ఆస్వాదన .

  సంజీవని  =  దివ్య ఔషధం .


  ఓం శాంతి

  ఓం నమఃశివాయ 🙏.

  యడ్ల శ్రీనివాసరావు 12 June 2026 9:00 pm.




Thursday, June 11, 2026

755. మరిచావా నేస్తమా

 

మరిచావా  నేస్తమా 


• మరిచావా  . . .   మరిచావా

  మై మరిచావా   నేస్తమా .

  మట్టి  వాసనలు  మరిచావా  .

• మంచు  తెరల  ఉదయం లో

  మన బడి పయనం   మరిచావా . . . 


• సూరీడు   పలకరింపు లో

  నీ  చూపులు   చిలకరించడం .

• పైరు  గట్టు   గడ్డి బాటలో

  మన  ఎగుడు   దిగుడు

  అడుగుల   వయనం .

• రబ్బరు చెప్పుల   తడబాటు తో

  రబ్బరు చెప్పుల   తడబాటు తో

  రబ్బరు బొమ్మలా   ఎగిరిన   మన  బాల్యం

  మరిచావా . . .  మై మరిచావా .


• మరిచావా  . . .   మరిచావా

  మై మరిచావా    నేస్తమా

  మట్టి వాసనలు    మరిచావా .

• మంచు  తెరల   ఉదయం లో

  మన  బడి   పయనం  మరిచావా . . .


• తూనీగ ల కై      పరుగులు

  తొక్కుడు  బిళ్ళ లో     తైతక్కలు


• చిన్ని పళ్ళతో      నీ చిర్రుబుర్రులు

  చేతి సంచి తో     మన  చెట్టాపట్టాలు .


• వానలు     నింపిన    సంతోషాలు

  వానలు     నింపిన    సంతోషాలు

  వయనం    తెలియని    మన  కేరింతలు

  మరిచావా  . . .  మై మరిచావా .


• మరిచావా . . .  మరిచావా

  మై  మరిచావా     నేస్తమా

‌ మట్టి వాసనలు    మరిచావా .

• మంచు తెరల   ఉదయం లో

  మన  బడి పయనం    మరిచావా . . .


• భయపెట్టే   బడిలో    దండనలు .

  బిక్కు బిక్కుమంటూ  

  బెల్ కోసం   ఎదురు చూపులు .


• పాల ఐస్ కై      పడిగాపులు

  పీచు మిఠాయి కి   పరుగు పందాలు


• మరిచావా  . . .  మరిచావా

  మై  మరిచావా    నేస్తమా

  మట్టి వాసనలు    మరిచావా .

• మంచు తెరల    ఉదయం లో

  మన  బడి పయనం     మరిచావా . . .





యడ్ల శ్రీనివాసరావు 11 June 2026 10:00 PM



761. గురువు - జ్ఞానం మనిషి కి అవసరమా?

గురువు . . . జ్ఞానం మనిషి కి అవసరమా?   గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః    గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై  శ్రీ గురవే నమః  • భగవంతు...