Monday, September 6, 2021

85. ఎవరు మంచి…ఎవరు చెడు

 

ఎవరు మంచి…ఎవరు చెడు


• మంచి చెడు , పాపం పుణ్యం, దుఃఖం సంతోషం ఇటువంటివన్నీయు, మానవ జన్మలో మనుషులు కేవలం తమ కర్మలు అనుసారం, మానసిక ,శారీరక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పరుచుకున్నవి. అంటే ఒక విధముగా అజ్ఞానంతో సృష్టించుకున్నవే. నిజానికి మంచి అంటే ఉపకారం, సంతోషం…. చెడు అంటే అపకారం, దుఃఖం అని అనుకోవడం అవివేకం.

ఎందుకంటే, ఒక వ్యసనానికి బానిస అయిన వాడు, ఎవరికి అపకారం తలపెట్టకపోయినా చెడ్డవాడు అని అంటారు, కానీ వాడు ఆ వ్యసనంలో ఎంతో సంతోషం పొందుతూ ఉంటాడు , వాడి జ్ఞానానికి ఆదే సంతోషం. కానీ వాడు జీవించినంత కాలం ఆ వ్యసనం అని చెపుతున్న అలవాటు లోనే సంతోషంగా ఉంటాడు.

• అదేవిధంగా మంచివాడు అనబడే గుర్తింపు తో ఉన్న ఒక మనిషి లోపల ఎంతో దుఃఖాన్ని, చెడుని, బాధని, మానసిక వ్యధని అనుభవిస్తూ , పైకి శాంతంగా, నిదానంగా , ఆదర్శం గా కనిపిస్తూ ఉంటాడు. అటువంటి వాడిని చూసి అందరూ మంచివాడు అంటుంటారు. కానీ ఆ మనిషి అంతర్గతం పరమ వేదనతో ఉంటుంది. ఇటువంటి విభిన్నమైన పరిస్థితుల్లో ఎవరు మంచిని, ఎవరు చెడుని అనుభవిస్తున్నట్లు..? ఇవన్నియు కేవలం మనిషి తనకు ఉన్న, మానసిక శక్తి గ్రహిస్తున్న స్పందనలు మాత్రమే అనిపిస్తాయి.

• ఒక విషం ను(poison), మనం చెడు అనుకుంటే , అదే విషం ను మందుగా ఉపయోగిస్తూ (medicine) ఎన్నో రుగ్మతలను నయం చేస్తారు. అంటే ఇక్కడ చెడు అనుకునే విషం కూడా ఒక శ్రేయస్సు, మంచి కొరకు ఉపయోగపడుతుంది .

• మనుషులకు  ఈ రోజు ఒకటి మంచి అనిపిస్తుంది . అదే రేపు చెడుగా అనిపిస్తుంది.....అదే చెడు రేపు మంచి గా కనిపిస్తుంది.

• ఈ సృష్టి చక్రం గాని, మానవ జీవన చక్రం గాని సమతూకం (balance) అవ్వాలంటే మంచి, చెడు…పాపం, పుణ్యం…సంతోషం, దుఃఖం అన్ని ఉండవలసిందే. ఎందుకంటే positive, negative లను వాటికి ఉండే ప్రాముఖ్యత లతో భగవంతుడు సమ దృష్టితోనే సృష్టించాడు.

• అందువలన మంచివారు , చెడ్డవారు , గుణగణాలు ఇటువంటి వాటి మీద పెట్టే దృష్టి కంటే వీటికి అతీతంగా పరమాత్మను తెలుసుకునే మార్గంలో ప్రయాణిస్తే ప్రతి వ్యక్తికి తాను మంచి వాడా? చెడ్డవాడా? లేక ఇతరులు మంచివారా? చెడ్డవారా? .....అసలు తాను ఎవరు.... అనే ఒక స్వీయ అనుభవం తోడైనపుడు, సరాసరి పరమాత్మ నుంచే సమాధానం తెలుస్తుంది.

• స్థితప్రజ్ఞత కలిగిన మానవునికి , అంతరాత్మను గుర్తించిన మనిషికి శూన్యం , శూన్యం లో మౌనం, మౌనంలో సర్వ సమానత్వం కనిపిస్తుంది.     

• చేసిన కర్మల అనుసారంగా నే ఫలితాన్ని అనుభవించే నిర్ణయం మనిషి పుట్టుక తోనే భగవంతుడు అమలు చేశాడు. నీవు ఎవరివో, నీ జన్మకు మూలం ఏమిటో నీకు ఒక స్పష్టత కలిగినపుడు మంచి చెడు, సంతోషం బాధ, అనే వాటికి తేడా తెలియదు , అప్పుడు నీకు తెలిసేది ఒక్కటే సర్వం ఏకం సమానం.

• పరిస్థితులను దృష్ట్యా మనిషి లో మారే లక్షణాలను గురించి ఆలోచించి , మనిషి ని నిర్ణయించే(మంచి, చెడు) కంటే ….. పరిస్థితులను అర్థం చేసుకోవడం ప్రతి మనిషి మనుగడకు చాలా అవసరం. ఇదే చివరిగా నీవు ఎవరివో, ఈ బాహ్య ప్రపంచానికి కనిపించేది…శరీరం ఉన్నా, లేకున్నా.


యడ్ల శ్రీనివాసరావు  5 sep 2021 , 10:30 pm


No comments:

Post a Comment

499. నిశ్శబ్దం - చీకటి

  నిశ్శబ్దం - చీకటి • వెలుగు లో కూర్చుని వెలుగుని ఆనందించ గలగడం అనేది అమాయకత్వం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వెలుగు ఎవరికైనా కేవలం కొంత సమయం మ...