Thursday, November 17, 2022

271. ఆది పురుషుడు

 

ఆది పురుషుడు



• అంత్యకాలమున  అవతరించిన   ఆది పురుషా

• సంధికాలమున    సంగమించిన    సత్వ పురుషా


• ఏమి కోరేది  …  ఏమి అడిగేది

• వీసెడు  విభూతి తో 

  విను వీధిన    విహరించే    విజయేశుడా

• ఏమి కోరేది  …  నిను ఏమి అడిగేది


• కలి మాయ తో     

  కల్లోల  మవుతున్న  జీవులం.

• కన్నీటి  లో   మునిగి 

  కరిగి  'పో'తున్న   పాపులం.


• అజ్ఞాన చీకటి లో 

  ఆశాపాశాలకు  వశమైన    అంధులం.

• సుఖశాంతి కోసం 

  శతకోటి  దండాలు  పెడుతున్న  ధీనులం.


• అంత్యకాలమున    అవతరించిన   ఆది పురుషా

• సంధికాలమున     సంగమించిన    సత్వ పురుషా


• ఏమి కోరేది  …  ఏమి అడిగేది

  ఏమి కోరేది  …  నిను ఏమి అడిగేది


• ఆది గురువై న      ఓ శివ పరమాత్మ

  సత్యము ను చూపు      జ్ఞానము ను తెలుపు.


• బూటకపు   నాటకపు

  బ్రతుకులే గా   కర్మ బంధాల   జీవితం.

• ఎత్తులు పై ఎత్తుల

  ఆట యే గా   చెదరంగపు   జీవనం.


• దుఃఖము లో    సూక్ష్మ  దివ్యత్వం

  దాగి ఉందని     ఎందరికి తెలుసు.

• సుఖము తో     చివరికి   హీనత్వం

  మిగులు నని    ఎందరికి తెలుసు.


• అంత్యకాలమున   అవతరించిన   ఆది పురుషా

• సంధికాలమున     సంగమించిన   సత్వ పురుషా


• ఏమి కోరేది  …  ఏమి అడిగేది

  ఏమి కోరేది  …  నిను ఏమి అడిగేది.


• కాష్టం లో    నిదురవుతావు

  కాటికాపరి లా  తిరుగుతావు

  నీ బైరాగి  తత్వం  ఎందరికి  ఎరుక.


• మాయలో  తేలుతూ

  మోహం లో  మునిగే  వారికి

  నీ *మర్మమేమిటో  ఎప్పటికీ  తెలిసేది.



*మర్మము = జీవన స్థితి, రహస్యం.


అంత్యకాలం, సంధికాలం అనగా కలియుగం పూర్తిగా అంతం అయ్యే సంగమ సమయంలో(ప్రస్తుతం నడుస్తున్న కాలం) అది పురుషుడు, సత్వ (బలం, భాగ్యం) పురుషుడు అయిన శివ పరమాత్ముడు ఈ సృష్టి ని లయం చేయడానికి  వస్తాడు.

కలియుగంలో మాయలో పడి మనుషులు అజ్ఞానులై ఈ రంగుల ప్రపంచం నిజమైనది, శాశ్వతమైనదని భావించి , భగవంతుడు ని అర్దం లేని స్వార్థం తో కూడిన కోరికలతో పూజిస్తారు , కానీ ఫలితం పొందక దుఃఖిలై కొట్టుమిట్టాడుతారు.   


మానవ బంధాలు,  రక్త సంబంధాలు  అన్నీ  పూర్తి గా గోతికాడ నక్కల వలె మోసపూరితమైన ఆలోచనలతో కలుషితం అయిపోతాయి.  మోహం తో  లౌకిక సుఖాలకు బానిసలై హీనత్వం పొంది, అనారోగ్యాల బారిన పడి అర్థాంతరంగా కాలం చేస్తారు. 

ప్రతీ ఒక్కరూ దుఃఖం లో మునిగి ఉంటారు కానీ, ఆ దుఃఖం లో నే, దుఃఖం తోనే భగవంతుడు తమ పాప కర్మలను దగ్దం చేసి దివ్యత్వం కలుగ చేస్తాడని గ్రహించలేరు. ఇదంతా కలి మాయ ప్రభావం వలన మనిషి సత్యం  అనేది  గ్రహించక పోవడం వలన, ధర్మం ఆచరించక పోవడం వలన జరుగుతుంది.


బాధలు భరించలేక ఉపశమనం కోసం భక్తి చేస్తారు కానీ అందులో అంతరార్థం  గ్రహించ లేక,    జీవన విధానం , మనసు, బుద్ది , ఆలోచనల ను మార్చు కోలేక నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. 

శివుని పూజిస్తారు కానీ శివుని తత్వం తెలుసుకో లేరు. ఎటుచూసినా, ఏం చూసినా అంతా ఆడంబరం తప్ప సూక్ష్మ స్థితి , పరిజ్ఞానం ఉండదు. దీనంతటికీ మూలం ఆది గురువై న శివుడు చెప్పిన అసలు సిసలైన జ్ఞానం తెలుసుకోలేక పోవడం.


భగవంతుని పూజించడం  కంటే అర్దం చేసుకోవడమే అత్యంత ఉత్తమం.  (అంటే పూజ చేయ వద్దు అని కాదు,  భగవంతుడు ఆచరించ మని  చెప్పి న విధంగా ఆచరిస్తే  అది పూజ కంటే గొప్ప ది  అని అర్దం.)


యడ్ల శ్రీనివాసరావు 17 Nov 2022 11:00 pm.





No comments:

Post a Comment

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...