Tuesday, August 5, 2025

675. దేహం - ఆత్మ


దేహం – ఆత్మ


• మనిషి మరణించిన వెంటనే , ఆత్మ శరీరం వదిలి శరీరం చుట్టూ భ్రాంతి , మోహం తో తిరుగుతూ ఉంటుంది.  దేహానికి అంత్య క్రియలు చేసిన తరువాత కూడా తాను నివసించిన ప్రాంతం , పరిసారాలను వదలలేక చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. 

13 రోజుల దిన  కర్మ కాండ క్రియలు పూర్తి అయిన తరువాత ఆత్మ  మరో  గర్భంలో లోనికి ప్రవేశించి శరీరం తీసుకోవడం జరుగుతుంది. 

ఆత్మ , తల్లి గర్భం లో ఉన్నప్పుడు  గత జన్మల స్మృతులు ,  గత జన్మలలో మిగిలి పోయిన పెండింగ్ కర్మలు ఈ జన్మలో పూర్తి చేయవలసినవి ,  అదే విధంగా గత జన్మల లో చేసిన  వికర్మలు స్పష్టం గా గుర్తు ఉంటాయి.

ఎందుకంటే మనిషి చనిపోయిన తరువాత, తన అసలు స్వరూపం తాను ఒక ఆత్మ అనే సత్యం  గ్రహిస్తాడు.

ఆత్మ కి పాపపుణ్యాలు స్పష్టం గా తెలుస్తాయి.

మరలా ఆత్మ తల్లి గర్భంలో  చేరి నూతన శరీరం లోనికి ప్రవేశించే ముందు , పరమాత్మ అయిన శివుని ని వేడుకుంటుంది, ఈ పెండింగ్ కర్మలు బుణాలు తీర్చుకునేందుకు శరీరం కావాలని ప్రాధేయపడుతుంది .  . . . తద్వారా , ఆత్మే  తన శరీరాన్ని  గత కర్మల అనుసారం స్వయం గా ఎక్కడ , ఏ గర్భం లో జన్మ తీసుకోవాలో  ఇష్టపూర్వకంగా ఎంచుకుంటుంది .

9 నెలలు తరువాత  గర్భం లోనుంచి బయటకు, ఈ మాయా లోకం లోనికి వచ్చాక సమస్తం ఆత్మ మరచి పోతుంది . తాను ఒక దేహం , మనిషి ని అనే స్పృహ తో జీవించడం ఆరంభిస్తుంది. 


• నేటి , మానవుని బంధాలు అన్నీ పూర్తి గా గత జన్మల బుణాలు . శివుని తో  అనుసంధానం అయి జ్ఞానయోగాలను  అవలంభించి , ఆచరించినపుడు ,  ప్రతీ సూక్ష్మ విషయం స్పష్టం మనో నేత్రం ద్వారా అర్దం అవుతుంది . ఇదే అంతర్ముఖ  జీవన ప్రయాణం.


• కర్మ బంధాలు బుణాల ఆటల లోనే  జీవితం అనే డ్రామా ప్రతి మనిషి కి  నడుస్తుంది . బుద్ధి శుద్ధి చేసుకోగలిగితే , ఐహిక వికారాలు వదిలి వేయడం ద్వారా ఆలోచనలలో పవిత్రత చేకూరుతుంది. అప్పుడు మాత్రమే శివుని ఆశీర్వాదం తో అంతర్దృష్టి (మనో నేత్రం , Intuition power) తెరుచుకొని, సద్గురువు యొక్క జ్ఞానం లభించి, త్రికాల సందర్శనం జరుగుతుంది.

• కానీ ఇదంతా అంత సాదా సీదాగా జరిగే విషయం కాదు. అలా అని అసాధ్యం కాదు. ఎందుకంటే ఏనాడైతే పరమాత్ము ని గురించి యదార్థం, సత్యం తెలుసుకోవడం జరుగుతుందో అప్పుడే  ఇవన్నీ సహజ సాధ్యం అవుతాయి.


• కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే , పరమాత్మ వైపు దృష్టి సారించే సమయం నుంచే మాయ ఏదొక రూపం లో ఇబ్బంది , సమస్యలను సృష్టిస్తుంది . ఎందుకంటే మనిషి నేడు జీవించేది మాయా పరిపాలన చేసే లోకం లో . మాయను విడిచి దైవం వైపు  సత్యతతో  వెళతానంటే  మాయ అంత సులభంగా అంగీకరించదు . ఎందుకంటే అనేక జన్మలు నుంచి మనిషి , మాయ తో కలిసి జీవిస్తూ ఉండడం వలన . . . కానీ మాయ ను జయించే విధానం ఎప్పటికప్పుడు స్వయం గా శివుడే , జ్ఞాన ధ్యాన యోగ సాధన ల ద్వారా తెలియచేస్తూ ఉంటాడు

ఇక్కడ గమనించవలసిన విషయం, భక్తి మార్గం లో ఉన్న వారికి  ,మాయ వలన  ఏ ఇబ్బందీ కలుగదు. ఎందుకంటే మాయ కి తెలుసు , భక్తి ద్వారా ఎవరికీ భగవత్ ముక్తి లభించదు అని .  


• ఇంతకీ మాయ ఎక్కడో ఉండదు. మనిషి బుద్ధి లో  ఆలోచనలు, బలహీనతలు రూపం లో , బుద్ధి లో ఏదొక మారుమూల నక్కి నక్కి దొంగ వలే ఉంటుంది . 

అదే విధంగా కుటుంబం, సమాజం , బంధాలు , సాంగత్యాలలో , మిత్రులు  ఇలా  ప్రతి వ్యక్తి లో ఉన్న  మాయ  ,  ఏదొక రూపం లో   దైవానికి  దగ్గర అయ్యే వారి పై  మాటలతో , చేతులతో , వికారాల తో దాడి చేస్తుంది . 

బ్రహ్మ కుమారీస్  ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం మౌంట్ అబూ, ద్వారా రాజయోగం శిక్షణ తో  జ్ఞాన యోగాలు అభ్యాసం చేస్తే ఇదంతా  తెలుస్తుంది. వారి శిక్షణా కేంద్రాలు ప్రతీ ఊరిలో ఉన్నాయి. ప్రపంచంలో 137 దేశాలలో  వేల కొలది శిక్షణా కేంద్రాలు , ప్రతీ భాష లోని వారికి అందుబాటులో ఉన్నాయి.  శివుడు విశ్వ సృష్టి కర్త.  ఈ రాజయోగ శిక్షణ ద్వారా శివుని యధార్థం , ఆత్మ పరమాత్మ జ్ఞానము , మనిషి సూక్ష్మ రహస్యాలు తెలుసుకోవడం సాధ్యం అవుతుంది. 


• ఈ సూక్ష్మమైన విషయాలు భక్తి మార్గం లో తెలిసే అవకాశం అణువంత కూడా లేదు . ఎందుకంటే భక్తి కోరికలతో ముడి పడి ఉంటుంది. సత్యమైన జ్ఞాన మార్గం మాత్రమే ఈ సూక్ష్మం తెలియపరుస్తుంది ‌. జ్ఞానం ధ్యానం, యోగం ద్వారా కోరికలను సహజసిద్ధంగా విడిచి పెట్టడం తో (ముక్తి, జీవన్ముక్తి ) లభిస్తుంది .

• మనిషి తన జీవిత కాలం లో ముందుకు పయనిస్తూ అన్ని విధాలా ఎంతో ఎదుగుతున్నాను అని సంబరపడతాడు. ఇలా అనుకునే . . .  నేడు సమస్త మానవాళి  అన్నీ ఉన్నా సరే  అనేక సమస్యల తో దుఃఖ సాగరంలో మునిగి ఉంది . 

కాలం లో వెనక్కి పయనించి నపుడు మాత్రమే మనిషి కి తన మూలాలు తెలుస్తాయి , తద్వారా భవిష్యత్తును శ్రేష్ట కర్మల తో ఎలా ముందుకు తీసుకు వెళ్లి శుభకరం చేసుకోవచ్చో స్పష్టంగా తెలుసుకోగలడు .

• నేడు మన  సంబంధం , సంపర్కం , సాంగత్యం లోకి వచ్చిన ప్రతి మనిషికి   ప్రతి మనిషి తో ఒక బలమైన కారణం (purpose) , లెక్కాచారం (Karma Calculation and Settlement) ఉంటుంది. 

ఇది స్వయం గా తెలియచేసేది ఈశ్వరుడు , తనతో ప్రయాణం చేసి నపుడు మాత్రమే సాధ్యం అవుతుంది . ఇది శరీరానికి అతీతమైనది. ఆత్మ కు సంబంధించినది .

• శారీరక స్పృహ తో జీవించే వారికి ఇదంతా పూర్తి అస్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వారికి భౌతికంగా ఉండే రెండు కనుల తో మాత్రమే బుద్ధి పని చేస్తుంది. వారి మనో నేత్రం గాఢ నిద్ర లో  అనేక జన్మలు గా మూసుకు పోయి  ఉంటుంది.


 ఓం శాంతి 🙏

 ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 1 AUG 2025  10:00pm

No comments:

Post a Comment

695 . కొడుకా ఓ కొడుకా !

  కొడుకా    ఓ     కొడుకా ! • కొడుకా  ఓ  కొడుకా  !   కొడుకా  ఓ  కొడుకా  ! • అమ్మవారి   కంటే    ముందు   నీ   అమ్మను   కొలువ  రా  . . .  • పండ...