భగవంతుని కి నీ అవసరం ఉందా?
• ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా . . .
భగవంతుని కి నీ అవసరం ఉందా ?
అవును . . . ముమ్మాటికీ ఉంది .
• సాధారణంగా మనిషి తన కోరికలు తీరడానికి, తన దుఃఖం , సమస్యలు తొలగి పోవడానికి , సుఖం కోసం, అవసరాల కోసం భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటాడు.
ఇక్కడ , మనిషి తనకు మాత్రమే భగవంతుని యొక్క అవసరం ఉందని భావిస్తాడు. అందుకే పూజలు , భక్తి చేస్తున్నాను అంటాడు .
కొన్ని సార్లు అయితే , నేను ఎన్ని పూజలు వ్రతాలు చేసినా , నైవేద్యాలు సమర్పించినా దేవుడు నా పై ఇంకా కరుణ చూపించడం లేదు అంటాడు . నా సమస్యలు లేదా నా కోరికలు తీర్చలేదు అంటుంటాడు .
మరికొందరు అయితే , తమకు లేదా తమ వారికి ఏదైనా మరణం గాని , విషాద సంఘటనలు గాని సంభవిస్తే , ఆ భగవంతుడు ఓర్చుకో లేక పోయాడు , మా సంతోషాన్ని చూడ లేక పైకి తీసుకు పోయాడు అని దూషణలు చేస్తూ నిందిస్తారు .
అంతే కానీ . . . భగవంతుడు వలనే మేము సంతోషంగా ఉన్నాము , భగవంతుడు మా అవసరాలు తీర్చాడు అని మనస్ఫూర్తిగా వ్యక్తం చేసే వారు చాలా చాలా అరుదుగా ఉంటారు .
భగవంతుడు కేవలం కష్టాల్లో మాత్రమే మనిషి కి అత్యంత అవసరం అవుతాడు . ఎందుకంటే ఈ సమయంలో మనిషి నిస్సహాయడు గా ఉంటాడు కాబట్టి .
• ఇంతకీ భగవంతుని కి నీ అవసరం ఉందా అంటే ? . . . సమాధానం తప్పకుండా ఉంది.
• ఒక కుటుంబం లో . . . జన్మ నిచ్చిన తల్లి తండ్రలు ఎన్ని కష్టాలు భరించి అయినా సరే తమ పిల్లల పోషణ పాలన చేస్తారు. ఇది వారి బాధ్యత.
పిల్లలు పెద్ద వారు అయిపోయినా సరే , పెళ్లిళ్లు అయినా సరే, వారి పద్ధతులు సంస్కారాలు అలవాట్లు ఎలాంటివైన సరే తల్లి తండ్రులు జీవించి ఉన్నంత వరకు తమ పిల్లల మరియు మనుమల సంరక్షణ , ప్రేమ కోసం విలవిలాడుతుంటారు . పొరపాటున కూడా తమ పిల్లలకు అపకారం తలపెట్టరు .
• అదే విధంగా . . .
ఈ సృష్టి లోని మానవులు అందరూ భగవంతుని సంతానం. ఇది జగమెరిగిన సత్యం. భగవంతుడే సృష్టి కర్త . అందరికీ తల్లి మరియు తండ్రి . మరి భగవంతుడు అయిన తండ్రి తన పిల్లలు అయిన మానవులందరి ని నిరంతరం సంరక్షిస్తూ ప్రేమ తో ఆలనా పాలనా చూస్తాడు. ఇది ఆయన భాధ్యత.
• అందుకే భగవంతుని కి నీ అవసరం ఉంది. ఆయన నిన్ను ఏనాడూ విడిచి ఉండడు, ఉండలేడు . అలాగే ఆయన నిన్ను విడిచి పెట్టడు , నేటికీ విడిచి పెట్టలేదు కూడా .
ఎందుకంటే భగవంతుడు కూడా కర్మ సిద్ధాంతానికి లోబడి తన కర్తవ్యం , ధర్మం నిర్వర్తిస్తాడు . ఈ సృష్టి లోని తన సంతానం అయిన మానవులందరి సంరక్షణ చేస్తాడు. ఇది ఆయనకి అవసరం. భగవంతుడు కర్మ సిద్ధాంతానికి అతీతం కాదు.
• కానీ . . . కానీ . . .
సాధారణంగా ఈ భౌతిక ప్రపంచంలో , ఏ కుటుంబం లో నైనా పిల్లలు తమకు జన్మ నిచ్చిన తండ్రి చెప్పిన విధంగా నడచుకోక , తండ్రి ని విలువ గౌరవం తో గుర్తించక కాదని విడిచి తమ ఇష్టానుసారం దూరంగా వెళ్లి పోతే , అదే విధంగా తల్లి తండ్రుల ను మనసు లో నుంచి చెరిపి వేసి , మరచి పోతే ఆ తండ్రి మాత్రం ఏం చేయగలడు .
అదే విధంగా సృష్టి కర్త , తండ్రి , పరమాత్మ , భగవంతుడు అయిన శివుని యొక్క యధార్థం తెలుసుకోక , శివుని తో అనుసంధానం కాకుండా మానవులు ఉన్నప్పుడు తండ్రి శివుడు మాత్రం ఏం చేయగలడు .
• నేటి కాలంలో మానవుడు పూర్తిగా మాయ కి వశం అయి వికారాలతో అనేక వికర్మలు చేస్తూ శివుడు అయిన తండ్రి ని పూర్తిగా మరచి పోయి , నేను అనే అహం తో విర్రవీగుతూ ఉంటాడు .
శివుడు అంటే కేవలం గుడిలో ఉండే జడ లింగం అనుకుంటాడు.
కానీ శివుడు అంటే ఈ విశ్వశక్తి అని , ఆ శక్తి నే ఆధార భూతం చేసుకొని మనిషి తాను ప్రాణం పోసుకొని, నేడు జీవనం సాగిస్తున్నాడని విషయం పూర్తిగా మరచి పోయి ఉంటాడు.
ఆ విశ్వ శక్తి లోని పంచభూతాల మిళితం వలనే తన జన్మ ఆవిర్భావం జరిగింది అని మనిషి తెలుసుకోడు . తాను శివుని సంతానం అని అనుకోడు . తనలో నిండి ఉన్నది శివశక్తి అని స్పృహతో గ్రహించక , లేనిపోని వికారాలకు , వ్యసనాలకు తన శక్తి ని ఉపయోగిస్తాడు మానవుడు .
• శివుడు ఇదంతా చూస్తూ, అయ్యొ నా పిల్లలు అమాయకులు మాయ లో పడి నన్ను మరిచారు. మాయ వీరిని పూర్తిగా తినేస్తుంది , నేను ఎలాగైనా సం రక్షించాలి అనే తపనతో నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటాడు శివుడు . ఇదే భగవంతుని కి నీ పట్ల ఉన్న ఏకైక అవసరం .
• కానీ , మాయకు వికర్మల కి బానిస అయిపోయి న మానవుడు తన తండ్రి శివుని యధార్థం తెలుసుకోడు . శివుని తో అనుసంధానం అవడు , అవలేక పోతాడు . ఎందుకంటే , ఎన్నో జన్మలు గా తెలిసి తెలియక చేసిన పాప కర్మల మిగిలి ఉన్నందున .
మనిషి శివుని తో అనుసంధానం కావాలంటే భౌతిక ప్రపంచం లో కర్మ శేషం , బుణాలు తీరి పోవాలి . అంత వరకు , శివుని యధార్థం తెలియక ఒక విగ్రహం, లింగ రూపం మాత్రమే అనుకొని భక్తి చేస్తూ ఉంటాడు .
• ఈ సృష్టి లో మనిషి ది ఎన్నో జనన మరణాలు కలిగిన జన్మ జన్మల నిరంతర ప్రయాణం . తలపై ఉన్న వికర్మల భారం తీరాలంటే శివుని స్మృతి నిత్యం ఉండాలి . తిరిగి ఎటువంటి వికర్మలు చేయ కూడదు.
*వికర్మలు అనగా చెడు కర్మలు, పాపాలు. ఇతరులకు దుఃఖం ఇచ్చుట వంటివి .
ఓం నమఃశివాయ 🙏
On the way to PUNE ✍️
యడ్ల శ్రీనివాసరావు 5 July 2025 ,11:00 PM.
No comments:
Post a Comment