Sunday, December 28, 2025

713 . శివానుభవం

 

శివానుభవం



• శివుని   మది

  సింహాసనం . . . సింహాసనం

• నా శివుని  ఒడి

  ప్రేమామృతం . . . ప్రేమామృతం


•  ప్రేమ లోని   మధువు తో    

   నవ వధువు గా   చేసేను   

   విభుడు . . .  నా  విభుడు .

•  ఒడి లోని    లాలన తో   

   పసి పాప గా   ఆడించె 

   హరుడు . . . నా  హరుడు .


• శివుని   మది

  సింహాసనం  . . .  సింహాసనం

• నా  శివుని  ఒడి

  ప్రేమామృతం  . . .  ప్రేమామృతం .


• ఆలన   పాలన తో

  భవబంధాల  ఆటవిడుపులు   ఇస్తున్నాడు .

• ఆదమరచిన  నన్ను

  ఆనంద సాగరంలో   తేలుస్తూ  

  ఉన్నాడు  శివుడు  . . .  నా శివుడు .


• శివుని మది

  సింహాసనం . . . సింహాసనం

• నా శివుని ఒడి

  ప్రేమామృతం . . . ప్రేమామృతం .


• పసి వాడి  నని   తలచి

  తన మది ని    సింహాసనం  చేసి

  కూర్చుండ   బెట్టాడు  .

• తోడు గా   నీడ యై   

 తన జత లోని  రాత లతో     

  విశ్వమంతా   విహరింప  

  చేస్తున్నాడు   శివుడు  . . .  నా శివుడు.


• శివుని    మది

  సింహాసనం   . . .   సింహాసనం

• నా శివుని   ఒడి

  ప్రేమామృతం  . . .  ప్రేమామృతం


• మాటలాడడు    కానీ

  మనసు కి    ప్రేరణ    ఇస్తాడు .

• కనపడడు     కానీ

  కనుల లో   కాంతి యై    ఉంటాడు.

• అనుభవాల   నిచ్చు  వాడు

  శివుడు.  . . .   నా శివుడు .

• అనుభూతి లో   ముంచు వాడు

  హరుడు   . . .   నా హరుడు .


• శివుని  మది

  సింహాసనం  . . .  సింహాసనం

• నా శివుని  ఒడి

  ప్రేమామృతం   . . .   ప్రేమామృతం .



ఓం శాంతి

ఓం నమఃశివాయ


యడ్ల శ్రీనివాసరావు 28 Dec 2025 9:20 PM.


Wednesday, December 24, 2025

712 . ఏది ధర్మం ?

 

 ఏది ధర్మం ?


• ధర్మం అనే మాట ఈ ప్రపంచంలో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది . అసలు ధర్మం అంటే మనిషి తన సహేతుకత తో ఆచరించవలసిన విధానం అని అర్థం . ఈ ధర్మం అనేది వృత్తి ప్రవృత్తి ని బట్టి మారుతూ ఉంటుంది .

• పరమాత్ముడు చెప్పిన ధర్మం గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చక్కగా వివరించాడు . మరియు ఈ భూమి పై “ధర్మ గ్లాని” జరిగినపుడు అంటే భూమి పై ధర్మం పూర్తిగా నశించినపుడు , అనగా మనిషి తాను ఆచరించివలసిన  విధానం తప్పినపుడు , అధర్మం విచ్చలవిడిగా పెచ్చురిల్లినపుడు  తాను తప్పకుండా ఈ భూమి పై ధర్మ స్థాపన కి అవతరిస్తానని  భగవంతుడు చెప్పాడు.


• ధర్మం గురించి కురుక్షేత్ర సంగ్రామం లో ఒక అద్భుతమైన సంఘటన కర్ణుడు మరియు శ్రీకృష్ణుడు మధ్య జరిగింది. కురుక్షేత్ర యుద్ధం రసవత్తరంగా జరుగుతున్న సమయంలో, కర్ణుడి రధ చక్రం ఊడి పక్కకు ఒరగగా అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు.

  “హే కృష్ణా! …. నా రధ చక్రం సరి చేసుకునేంత వరకు అర్జునుడిని విల్లు సంధించడం ఆపమని చెప్పు “ అంటాడు.

  అది వినిన శ్రీకృష్ణుడు , తాను భగవంతుని ధర్మ ప్రతినిధిగా ఉన్నప్పటికీ కూడా , అది విని మౌనం గా ఉంటాడు .

  ఇంతలో అర్జునుడు వైపు నుంచి బాణాలు మరింత వేగంగా కర్ణుడి మీద కు వస్తూ ఉంటాయి.

• మరలా రెండవ సారి కర్ణుడు శ్రీకృష్ణుడితో … హే కృష్ణా! ఇది నీకు ధర్మమా …. ఇది యుద్ధనీతి కాదు . దయచేసి అర్జునుడి తో చెప్పు, నా రధ చక్రం సరి చేసుకునేంత వరకు యుద్ధం ఆపమని. అని తీవ్ర స్వరం తో వేడు కుంటాడు.

  అయినప్పటికీ శ్రీకృష్ణుడు కర్ణుడిని చూస్తూ చిరునవ్వు తో మౌనం గా ఉంటాడు.

  అప్పుడు కర్ణుడు . . . శ్రీకృష్ణుడిని ఉద్ధేశించి ఉద్వేగం తో ఇలా అంటాడు. నువ్వు ధర్మాత్ముడి వేనా, పాండవుల పక్షపాతి . . . యుద్ధ ధర్మం ఆచరించమని చెప్పవలసిన నువ్వు మౌనం గా ఉండడం నీకు సబబు కాదు అని అంటాడు.

‌  అప్పుడు శ్రీకృష్ణుడు …. తన నోరు విప్పి కర్ణుడి తో ఇలా అంటాడు.

• అహో! కర్ణా … బాగుంది, చాలా బాగుంది . నేడు నీవు ఆపద లో ఉన్నావు  కాబట్టి , నీ వరకూ వచ్చే సరికి ధర్మం, నీతి, న్యాయం గురించి మాట్లాడుతున్నావు.

• నాడు నిండు కౌరవ సభలో , ధుర్యోధనుడు ద్రౌపదిని వివస్త్ర చేసినప్పుడు , ద్రౌపది రక్షించండి . . . రక్షించండి . . . అని నిండు సభ లోని వారిని వేసుకున్నప్పుడు , నీ ధర్మం ఏమైంది. ఆనాడు సభలో జరుగుతున్నది అధర్మం అని తెలిసినా కూడా యోధుడి వైన నీవు మౌనం గా ఉన్నావు. కనీసం ధుర్యోధనుడిని  ఆపే కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు. అధర్మం నీ ఎదురుగా జరుగుతున్నపుడు , నాడు నీవు చేయనిది, నేడు నీవు నన్ను ధర్మం గురించి ప్రశ్నించుచున్నావు. ఇది నీకు ధర్మమే నా అని తిరిగి శ్రీకృష్ణుడు అంటాడు.

• కర్మ ఫలం అనుభవించు . . . నీవు ఏది చేశావో అదే నీకు నేడు తిరిగి వస్తుంది. నేను ధర్మ మార్గం చూపగలను , చెప్పగలను అంతవరకే  నా విధి . బుద్ధి వివేకం తో ధర్మాన్ని ఆచరించవలసింది నీవు అంటాడు .

  ధర్మో రక్షతి రక్షితః . . . ధర్మాన్ని ఆచరించడమే కాదు, రక్షించిన నాడు అది తిరిగి కాపాడుతుంది అని శ్రీకృష్ణుడు కర్ణుడి తో చెపుతాడు.

• అది వినిన కర్ణుడు పశ్చాత్తాపం చెందుతాడు.


  🌹🌹🌹🌹🌹🌹



• ఇకపోతే …. ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అని కలియుగ దైవం గా భావించే వేంకటేశ్వర స్వామి ఆలయాలలో ముఖ్యం గా తిరుమలలో మనం చూస్తాం, చదువుతాం. కానీ ఈ ధర్మం అనే విషయం గురించి ఎంత వరకు మనసు లో చింతన చేస్తాం ?, ధర్మాన్ని మనం ఎంత వరకు ఎలా ఆచరిస్తూ ఉంటాం  ?  అనేది మనమే సద్విమర్శ చేసుకోగలగాలి . ఎదుటి వారు ఆచరించ వలసిన ధర్మాలు చక్కగా చెపుతాం. కానీ మనం ఆచరించ వలసిన ధర్మం వరకు వచ్చేసరికి  అహం లో మునిగి ఉంటాం . ఇది నేటి మానవ నైజం .

  ఇక్కడ గమనించ వలసిన అంశం

• వేం = పాపాలు

• కట = హరించే

• ఈశ్వరుడు = శివుడు , పరమాత్ముడు.

• వేంకటేశ్వరుడు అనగా కలియుగం లో పాపాలను హరించే శివుడు అని అర్థం.


• భగవంతుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన మనకు భగవంతుడే చెపుతున్నాడు , నీ ధర్మం ఏమిటో తెలుసుకొని ఆచరించమని .

• ధర్మాన్ని ఆచరించడం అనేది దైవ దర్శనం కంటే మహోన్నతమైనది . దైవ దర్శనం వలన పొందేది అల్ప కాలిక సంతోషం. భగవంతుడు ని ఆనందం గా భక్తి పారవశ్యంతో  దర్శిస్తాం , కానీ భగవంతుడు చెప్పిన విధానాలను మన లోని  మాయా బలహీనతల వలన ఆచరించ లేక పోతూ ఉంటాం.

• స్వయం భగవంతుడు చెప్పిన విధంగా ధర్మం ఆచరించరించ  గలిగిన నాడు , అది భగవంతుడి జత తో కలిసి అడుగులు వేస్తున్న ప్రయాణం గా మన జీవితం అవుతుంది .

• నేటి మనిషి జీవనం లో పాటించ వలసిన ఎన్నో ధర్మాలు ఉన్నాయి. వృత్తి ధర్మం, గృహస్థ ధర్మం వీటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. వృత్తి ధర్మాన్ని నిజాయితీ తో ఆచరించగలడం అనేది మనిషి జీవన పురోగతి కి అత్యంత అవసరం. నేటి కలుషిత ప్రపంచంలో కార్యాలయాలలో అవినీతి, లంచగొండితనం, వ్యాపారాలలో మోసం చేయడం అతి సహజం , సర్వ సాధారణం . దీనిని అరికట్టడం స్వయం పరివర్తన తో నే మనిషి కి సాధ్యం.

• రెండవది గృహస్త ధర్మం  . నేటి కలియుగంలో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. మనిషి యొక్క కర్మలు, బుణానుబంధాలు అధిక శాతం ముడిపడి ఉన్నది గృహస్థం ధర్మం లోనే .  ధర్మం తెలుసుకొని ఇవి ఆచరించిన నాడు మానవ జన్మ కు దుఃఖం నుంచి ముక్తి లభిస్తుంది. నేటి కుటుంబ వ్యవస్థలో పిల్లలు తల్లి తండ్రులు ఒకరి పట్ల మరొకరు వ్యవహారించ వలసిన విధానం, . . .  కుటుంబ స్థితి గతులు  మనుషుల మానసిక  పరిస్థితులు ఎలా ఉన్నా సరే భార్య భర్తలు ఒకరి పట్ల మరొకరు అనుసరించ వలసిన విధానం ,  ధర్మ యుక్తం గా బాధ్యత నెరిగి  ఆచరించ వలసిన అవసరం నేటి కాలంలో ఎంతైనా ఉంది.

• ఎందుకంటే …. నేటి కలికాలం పూర్తి మాయా ప్రపంచం. మనిషి కి ఏది మంచో ఏది చెడో కూడా సూక్ష్మంగా తెలుసుకో  లేని స్థితిలో మాయ కమ్మేసి జీవనం సాగిస్తున్నాడు మనిషి . అందుకు నిదర్శనం ….. ఈర్ష్య ద్వేషాలు , పగ ప్రతీకారాలు , కామ క్రోధాలు , అహంకారం,  స్వార్దం ,  నాకే సర్వస్వం తెలుసు - నేను నాది  అనే మాయ ,  ఏది సక్రమమో ఏది అక్రమమో తెలియని మానవ సంబంధాలు (లివింగ్ రిలేషన్ షిప్స్) ,  అవసరాలకు మించిన ధనం కోసం  దుర అలవాట్ల కు బానిస కావడం. 

ఇలాంటివన్నీ    కలిసి మనిషి జీవన విధానాన్ని అంధకారంలోకి తోసి , విచ్చలవిడి తనం , స్వేచ్ఛ అనే పేరుతో మానవ జన్మ పూర్తిగా వినాశనానం వైపు  అడుగులు వేస్తోంది. 

వీటన్నిటికి అతీతంగా కావాలంటే  , ఆది సనాతన దేవి దేవతా ధర్మం గురించి  బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారి సెంటర్స్ లో ఉచితం గా  నేర్పించే  సహజ రాజయోగ శిక్షణ ద్వారా తెలుసుకొని , మలచుకొని, పరిశీలించి పరివర్తన చేసుకోవడం ద్వారా  ప్రతి మనిషికి సాధ్యం అవుతుంది. 


మన మూలాల లోనే మన రహస్యాలు స్పష్టం గా పొందు పరిచబడి ఉన్నాయి.  అవి తెలుసుకునే ప్రయత్నం చేయక పోవడమే మన అజ్ఞానానికి దుఃఖానికి కారణం.


  ధర్మో రక్షతి రక్షితః



  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏.

  యడ్ల శ్రీనివాసరావు 24 Dec 2025 10:00 PM.


Sunday, December 21, 2025

711. మనసు వీ క్షణం

 

మనసు వీ క్షణం



• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

  చూస్తుంది . . . నా మనసు చూస్తుంది


• కనులు మూసుకున్న నాడే

  నా మనసు చూస్తుంది .

• కనులకు తెలియని లోకమే దో

  నాకు పరిచయం చేస్తుంది .


• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

 చూస్తుంది . . . నా మనసు చూస్తుంది


• మనసు   లోని    నిశ్శబ్దం

  పరవళ్ళు   తొక్కుతోంది  ప్రకృతి లో .

• మనసు   లోని   *వీక్షణలు

  దాటి   పోతున్నాయి   విశ్వాన్ని .


• ఇదే   నా  తరంగం

  ఇదే   నా  అంతరంగం .


• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

  చూస్తుంది . . . నా మనసు చూస్తుంది


• కనులు  మూసుకున్న  నాడే

  నా మనసు చూస్తుంది .

• కనులకు  తెలియని  లోకమే దో

  నాకు పరిచయం చేస్తుంది .


• తేలుతున్న  మనసు కి  తనువు

  భారమే     లేదు .

• సాగుతున్న  మనసు కి  సంతోషం 

  హద్ధు లే   లేవు .


• ఇదే  నా  ధ్యానం

  ఇదే  నా  *పరధ్యానం .


• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

  చూస్తుంది . . . నా మనసు చూస్తుంది .


• కనులు  మూసుకున్న  నాడే

  నా మనసు  చూస్తుంది .

• కనులకు  తెలియని  లోకమే దో

  నాకు పరిచయం చేస్తుంది .

 

వీక్షణలు = చూపులు

పరధ్యానం = శివ పరమాత్ముని స్మృతి యానం.


యడ్ల శ్రీనివాసరావు 21 Dec 2025 7:00 PM .


Sunday, December 14, 2025

710. మనిషి అన్వేషణ

 

మనిషి అన్వేషణ



ఈ భూమిపై మనిషి , మొదట తాను బ్రతకడానికి అన్వేషణ మొదలుపెట్టాడు. తర్వాత తన అవసరాలు తీర్చుకోవడానికి అన్వేషణ మొదలుపెట్టాడు . తర్వాత తాను సుఖపడడానికి అన్వేషణ మొదలు పెట్టాడు. తర్వాత అందరికంటే నేనే  గొప్పవాడిని  అని  నిరూపించుకునేందుకు అన్వేషణ  మొదలు పెట్టాడు . తర్వాత అందరిని శాసించడానికి  ప్రయత్నం చేశాడు . ఇలా మనిషి అన్వేషిస్తూనే  ఉన్నాడు .


జీవితాంతం సుఖాల కొరకు , ఆధిపత్యం కొరకు అన్వేషణ సాగుతుంది . ఇలా ఎప్పటి వరకు అంటే తన అంతిమ శ్వాస వరకు . ఇలాంటి అన్వేషణలో చివరికి మనిషి  మనశ్శాంతి  సుఖం  ప్రశాంతత  తృప్తి  కలగకుండానే  వెళ్ళిపోతాడు.


*మరి ఈ అన్వేషణకు ముగింపు ఎక్కడ ?  దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం .

మనిషి అన్వేషణ  అంతం  లేని యాత్ర.  

మనిషి జీవితం  ఒక నిరంతర అన్వేషణ.

మనిషి  మొదట  బ్రతకడానికి  ప్రయత్నించాడు.  భోజనం కోసం , నీటి కోసం , ఆశ్రయం కోసం పరుగులు పెట్టాడు. అది జీవనానికి పునాది. 

కానీ, మనిషికి  అది సరిపోలేదు  తర్వాత అవసరాలను తీర్చుకోవడం మొదలుపెట్టాడు. వస్త్రం, ఇల్లు,  సౌకర్యాలు,  భద్రత   ఇవన్నీ  పొందడం మొదలుపెట్టాడు. అవి సాధించిన తరువాత కూడా మనసు సంతృప్తి చెందలేదు.

సుఖం కోసం పరిగెత్తాడు . ఆ సుఖం వస్తే ఆనందం కావాలి .  ఆనందం  వచ్చిన  తర్వాత ఆధిపత్యం కావాలి.  ఆధిపత్యం వచ్చిన తర్వాత అధికారం కావాలి .  అధికారం  వస్తే  గర్వం కావాలి . ఇలా మనిషి  "బ్రతకడం" నుండి  "శాసించడం"  వరకు ప్రయాణం  చేశాడు.

కానీ  ఈ మొత్తం  ప్రయాణంలో  మనిషి ఒక ముఖ్యమైన  విషయాన్ని  కోల్పోయాడు  అది ఏమిటంటే   “తనను తాను ”.


ఆధిపత్యం  చివరలో  ఒంటరితనం  .  తాను అనుకున్నవన్ని  సాధించాడు.  మనిషికి   అన్నీ దొరికినట్లు  కనిపిస్తుంది . కానీ మనశ్శాంతి  మాత్రం దొరకదు.

కామం తో శారీరక సుఖం,  కోరికలతో భౌతిక సుఖం కోసం పరిగెత్తే  మనిషి  చివరికి  తెలుసుకుంటాడు,  సుఖం అనేది బయట దొరికేది కాదు , అది  తనలో దాగి ఉన్న ప్రశాంతతే  నిజమైన సుఖం అని .


*అన్వేషణ యొక్క చివరి ఘట్టం :

జీవితాంతం అన్వేషించిన  తర్వాత, మనిషి చివరగా ఆగి వెనక్కి చూస్తాడు .

“ఇంతకాలం నేను ఏమి వెతికాను?” అని.


*అప్పుడు తెలిసేది  ఒకటే : 

తాను  వెతికిన సుఖం డబ్బులో లేదు , తాను కోరిన గౌరవం లభించిన  పదవిలో  లేదు,  తాను వెతికిన శాంతి ఇతరులపై  ఆధిపత్యం చేయడం లో  లేదు.

అంతా  తనలోనే ఉంది ,

అయితే తాను ఎప్పుడూ  తన లోనికి . . . లో లోనికి చూడలేదు .

అయినా , అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది . . .

ఒక దశలో జీవితం ముగిసిపోతుంది , కానీ అన్వేషణ మాత్రం శేషం గానే  మిగిలిపోతుంది అనే సత్యాన్ని తెలుసుకోని మనిషి ,  తనలోని శాంతిని  గుర్తించని  మనిషి , ఎప్పటికీ తృప్తి పొందడు . 

అందుకే జ్ఞానులు చెప్పారు . . .  “సుఖం బయట వెతకకు , అది  నీ  అంతరంలో  దాగి  ఉందని.


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 15 Dec 2025 , 10:00 AM.

Friday, November 28, 2025

709. భగవంతుని జ్ఞానం - మనిషి భక్తి

 


భగవంతుని జ్ఞానం - మనిషి భక్తి



• భగవంతుని జ్ఞానం ఆధారంగా శాస్త్రాలలో ఎన్నో విషయాలు పొందుపరచబడ్డాయి. భక్తి మార్గం లో ఈ విషయాలను కధల రూపం లో భగవంతుడు , దేవతలు , మానవులు రాక్షసుల గురించి అనేక విధములుగా  వివరించారు .

• కానీ మనిషి జన్మ జన్మలు గా, తర తరాలుగా వాటిని కధలలాగే  చూడడానికి , వినడానికి అలవాటు పడి పోయాడు. అంతే కానీ ఆ కధలలో ఇమిడి ఉన్న గూఢ మైన జ్ఞాన అర్థాలు,  సూక్ష్మం తెలుసుకోలేక ,  పరిశీలించ లేక వాటిని కేవలం కధల లాగే చూస్తున్నాడు. ఒకవేళ ఏదైనా ఆ కధలో ఏదైనా సందేహం మానవుడికి తలెత్తినా , మూలాల్లో ఉన్న  వాస్తవాన్ని  యధాతధంగా   వివరించే వారు కూడా  నేడు అరుదు లేదా కరువు అనే చెప్పాలి.

ఉదాహరణకు ఈ కధ …. వివరణ.


శివపార్వతులకు కుమారస్వామి(సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) , వినాయకుడు ఇద్దరు పుత్రులు.

• కుమారస్వామి అందం గా ఉంటాడు , అందమైన నెమలిని వాహనం గా కలిగి ఉండేవాడు . అందుకే ఆయనను ఆకర్షణీయమైన బాలుడి రూపంలో విగ్రహాలలో చూపించారు . కుమారస్వామికి బాల్యం నుంచి కోపం గర్వం ఎక్కువ గా కలిగి ఉండేవాడు . ఆ స్వభావానికి  నిదర్శనం గా ఆయనను పడగ ఎత్తి ఉన్న పాము  రూపం గా  కూడా  ఆరాధించడం అది  కోపం చల్లారడం కోసం పాలు పోయాలని భక్తి ద్వారా చూపించారు . 

• మరో వైపు వినాయకుడు ఏనుగు తలతో, పెద్ద బొజ్జ తో , లావు గా అందం లేని వాడిగా ఉంటాడు . చిన్న ఎలుక వాహనం కలిగి ఉంటాడు . కానీ వినాయకుడు బుద్ధి శాలి. విశాలమైన బుద్ధి , ఆలోచన , పెద్ధల యెడల వినమ్రత కలిగి ఉండేవాడు.

ఒకసారి వినాయకుడు, కుమారస్వామి కి తండ్రి శివుడు, తన పుత్రులు ఇద్దరిలో ఎవరు గొప్ప వారు అని తేల్చేందుకు ఒక పరీక్ష పెడతాడు. ముల్లోకాలను ఎవరు ముందు చుట్టి వస్తారో వారే గొప్ప వారు గా నిర్ణయించ బడతారు అని చెపుతాడు.

దేవతలు అందరూ వినాయకుడు ని చూసి నవ్వుతారు . అంత శరీరం తో, ఎలుక వాహనం తో ముల్లోకాలు చుట్టడం అసాధ్యం అని వారికి తెలుసు, ఇదే విషయం వినాయకుడు కి కూడా అర్దం అవుతుంది. మరోవైపు కుమారస్వామి నెమలి వాహనంపై సునాయాసంగా ఎగిరి ముల్లోకాలను చుట్టి రాగలడు అని దేవతలందరూ అందరూ అనుకుంటారు. కుమారస్వామిదే విజయం అనుకుంటారు. కుమారస్వామి కూడా అదేవిధంగా భావిస్తాడు.

సృష్టి కర్త అయిన తండ్రి శివుని కి  ఈ పోటీ లోని మర్మం తెలిసినా మౌనం గా మనసు లో నవ్వుకుంటాడు. ఎందుకంటే శివుని కి తెలియనిది అంటూ ఏమీ ఉండదు .

వినాయకుడు మాత్రం ఇంత పెద్ద శరీరం తో , చిన్న ఎలుక తో తాను ముల్లోకాలను ఎలా తిరగగలను అని మనసు లో చాలా చింతిస్తాడు.

• పరీక్షా సమయం ఆసన్నమైనపుడు ఇద్దరూ తల్లి తండ్రులు అయిన శివపార్వతుల ఆశీర్వాదం తీసుకుని బయలుదేరారు. కుమారస్వామి చాలా సంతోషంగా, గర్వంతో నెమలి పై చాలా వేగంగా ముల్లోకాలు చుట్టడం కోసం బయలు దేరుతాడు.

  వినాయకుడికి తన శరీరం సహకరించదు అని తెలిసి , తనకు ఉన్న జ్ఞానం చేత తన బుద్ధి ని ఉపయోగించి ముల్లోకాలను సృష్టించిన వాడు, విశ్వానికి అధిపతి అయిన వాడు తన తండ్రి శివుడే కదా అని శివుని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తూ శివుని తో ఇలా అంటాడు. తండ్రి నేను ఇంత పెద్ద శరీరం తో, చిన్న ఎలుక వాహనం తో నేను ఎలా  ముల్లోకాలు తిరుగగలను . ఈ విశ్వానికి సృష్టికర్త అయిన మీరే సమస్త లోకములకు అధిపతి , అన్నింటికీ కర్త కర్మ క్రియ మీరే , నేను నిమిత్త మాత్రుడిని , మీ యందు ప్రదక్షిణ చేసినా ముల్లోకాలు చుట్టి వచ్చినట్లే అని తండ్రి పాదాల చెంత ప్రణమిల్లుతాడు.

• అది గ్రహించిన శివుడు , వినాయకుడి బుద్ధి , ఆలోచన కి సంతుష్టుడవుతాడు . శివుని మహిమ వలన ,  కుమారస్వామి ప్రతీ లోకం దర్శించడానికి వెళ్లే  సమయానికి , తన కంటే ముందుగా అక్కడి నుంచి వినాయకుడు వచ్చి వెళుతూ ఉండడం గమనిస్తాడు . చివరికి శివుని వద్దకు చేరే సరికి వినాయకుడు తన కంటే ముందుగా తండ్రి పాదాల చెంత ఉండడం చూసి , ఆశ్చర్యం తో అసహనానికి గురవుతాడు .

తరువాత విషయం తెలుసుకోని , తన కోపం, గర్వం వలన తాను పరాజయం పొందానాని , తన తండ్రి శివుడు ఈ విశ్వానికి సృష్టి కర్త అనే సత్యం తాను తెలుసుకో లేక పోయానని చింతించి తండ్రి పాదాల పై పడి క్షమించమని తనలోని కోపాన్ని గర్వాన్నీ పశ్చాత్తాపం తో  విడిచి పెడతాడు . మరియు వినాయకుని యొక్క బుద్ధి ఆలోచన కి నమస్కరిస్తాడు .

 అప్పుడు తండ్రి శివుడు , కుమారస్వామి యొక్క పరిపూర్ణత కి మెచ్చి , ఆశీర్వాదించిన  తరువాత కుమారస్వామి  సతోప్రధానం గా  అయి తండ్రి ద్వారా దివ్యత్వం పొంది  దేవత గా అవుతాడు .


• నేటికీ మనకు ఇది ఒక కధగా మాత్రమే తెలుసు. ఎందుకంటే అది విన్నంత సేపు లేదా చూస్తున్నంత సేపు దివ్యమైన భగవత్ రూపాలు శివపార్వతులు , అందమైన కుమారస్వామి , హాస్యం కలిగించే లా వినాయకుని స్వరూపం ఇవే మన కంటికి కనిపిస్తాయి.

కాసేపు , ఈ దైవీ అలంకార  ఆకర్షణా రూపాలను పక్కన పెట్టి , ఈ కధలో సూక్ష్మం, మూలం, రహస్యం ఏమిటో  పరిశీలించి  తెలుసు కొని ఆచరిస్తే మనిషి కి తన జన్మ ధన్యం అయినట్లే .


• సుబ్రహ్మణ్యుని వలే మనిషి తన లోని గర్వం, కోపం, అహం పూర్తిగా విడిచి పెట్టిన జీవించిన నాడు పరిపూర్ణుడై శివుని అనుగ్రహం పొందడమే కాకుండా , దైవీ గుణాలు , దైవీ శక్తుల తో దేవతా మూర్తుల వలే తేజోవంతుడు అవుతాడు అనేది ఇందులో సూక్ష్మం.


వినాయకుని వలే మనిషి తన దేహ స్వరూపం లో ఎన్ని అంగ వైకల్యాలు ఉన్నప్పటికీ , తాను చేస్తున్న కార్యాల లో  ఎన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ  , ఆటంకాలు ఎదురైనప్పటికి   ఆత్మ విశ్వాసం తో మంచి విశాలమైన బుద్ధి తో , కల్మషం లేని మనసుతో , నిర్మలత్వం తో భగవంతుని  యధార్థం తెలుసు కొని , తన సమస్య నివేదించినచో  తప్పకుండా పరిష్కారం పొందుతాడు. శివుని ఆశీస్సుల వలన దివ్య జ్ఞానము , వివేకము , అతీంద్రియ శక్తులు సహజ సిద్ధంగా పొందుతాడు .

 మనిషికి తన జన్మకు కారణం , తల్లి తండ్రులు అనే స్పృహ ఎరిగి , తాను జీవించి ఉన్నంత వరకూ తన తల్లి తండ్రుల ను గౌరవిస్తూ శిరసావహించిన వారికి తల్లి తండ్రుల ఆశీర్వాదం తో పాటు , సృష్టి కర్త శివుని ఆశీర్వాదం కూడా ఉంటుంది .


• చెప్పాలంటే ఈ కధ వినాయకుడు, కుమారస్వామి లకు సంబంధించిన విషయం గా చూడడం కంటే , కలికాలం లో మాయ వలన మనుషుల  గుణగణాలు  కోపం గర్వం అహం తో  నిండి  , వైకల్యాలు వైఫల్యాల ఆటంకాల తో మానవుని జీవన విధానం దుఃఖం తో నిండిపోతుందని  ముందే గ్రహించి, మనిషి శ్రేయస్సు కోసం భగవంతుడు తన జ్ఞానం లో  రచించిన  విధానాన్ని  పండితులు  కధలుగా  వినిపించారు .

 కానీ అది నేటి మానవుడి ఆచరణ కోసం దిక్సూచి అని , నేడు ఎవరికి  తెలియడం లేదు.  బహుశా  కధలను  మనసు కి  అన్వయించు కోవడం అలవాటు లేక పోవడం వలన అయి ఉంటుంది.  లేదా కధలను కలలు గానే ఊహించే అలవాటు అయిపోయి ఉండవచ్చు .  పురాణాలు, ఇతిహాస కధలలో ఉన్న పాత్రల జీవన విధానం,  సంఘటనల విషయాలు నేటి మన జీవితాల కోసమే  అని గ్రహించగలడం ఉత్తమం . 


యడ్ల శ్రీనివాసరావు 28 Nov 2025 ,7:30 PM.



Monday, November 24, 2025

708. మనిషి మోసపోయాడా ?

 

మనిషి మోసపోయాడా ?



• అవును . . . మనిషి ఈ కలి కాలం ఆది నుంచి 

  మోస పోయాడా ?

  మోసపోతూ  ఉన్నాడా ?  . . .


 ఈ విషయం  మనం ఎప్పుడైనా ఆలోచించామా ?

 ఇది గ్రహించలేక   అమాయకత్వం తో ఉన్నామా ?


• మన అందరికీ తెలిసిన విషయం , మనిషి ఇతరులను మోసం చెయ్యగలడు . ఒక మనిషి , ఇతరులను  మోసం  చేస్తేనే , ఆ మోసం బయటపడితేనే   మోసగాడు గా   ఈ లోకం లో అందరూ అభివర్ణిస్తారు . ఒకవేళ ఆ మోసం గురించి అందరికీ అంతర్గతం గా  తెలిసినా కూడా  అది బహిర్గతం  కాకపోతే  ఆ మనిషి ని  దొర లాగే కొనియాడుతారు . ఇది ఎంతవరకు నిజం ? . . . ఆలోచించండి ?.

అసలు, ఒక మనిషి ఇతరులను మోసం చేయకుంటే తాను గొప్ప వాడు అయిపోతాడా ? 

తాను  మంచివాడి గా   కీర్తించ బడతాడా ? 

తాను   మంచి మనిషిగా  రూపు దిద్ధికున్నట్లేనా ?


వీటిన్నిటికి సమాధానం స్పష్టత మనలో ఉందా? . .


• అసలు  మోసం అంటే ఏమిటి ?

 నయవంచన, ద్రోహం, అబద్ధాలు చెప్పడం , నిజాన్ని వక్రీకరించడం ఇలా అనేక విధాలుగా చేసే కర్మ ని మోసం  అని  అంటాం , వింటాం  .

• కానీ , మోసం  అంటే ఒక నిజాయితీ కలిగిన ఆలోచనని , సత్యత కలిగిన విషయాన్ని  మభ్య పెట్టడం లో ఆరితేరిన  మాయతో  కూడిన చర్య ,  ప్రక్రియే  మోసం .

• సహజ సిద్ధంగా  ప్రతి మనిషి కి  మానవ ధర్మం అనేది  ఒకటి ఉంటుంది. దాని  ప్రకారం మనిషి కి  తన  విజ్ణత తో  నిజాయితీ అనేది తెలుస్తుంది . ఈ నిజాయితీ ని  మనిషి  తనలోని మాయతో  మభ్య పెట్టడం ద్వారా  చేసే చర్య (కర్మ) యే  మోసం . 

అనగా ఇది ఒక మనిషి మనసు లో నుంచి ఆరంభం అయినపుడు , ఇతరులను మోసం చేయడం అనే దాని కంటే కూడా, ముందుగా మనిషి తనను తాను మోసం చేసుకుంటాడు అనేది వాస్తవం . అనగా తనలో  ఉన్న నిజాయితీ ని   తానే  మభ్య పెట్టుకుంటాడు. ఇది మనిషి అంతరంగం లో అనాదిగా  పెరుగుతూనే  ఉంది అనేది యధార్థం. 

అందుకే మనిషి అనేక సార్లు తాను  ఆలోచించేది ఒకటి . . . మాట్లాడేది మరొకటి . . . చేసేది ఇంకొకటి గా ఉంటుంది. ఈ మూడింటి కి సమన్వయం వంద శాతం ఎప్పుడూ ఉండదు . దీనినే మనిషి తనను తాను  మోసం  చేసుకోవడం గా  పేర్కొనవచ్చు.

• మనిషి , మానవ ధర్మం ద్వారా ఆచరించడానికి , ఉద్భవించిన  తన ఆలోచనల లోని  సత్యతను , నిజాయితీని తానే వక్రీకరించుకుంటూ , తనకు అనుగుణంగా ఉండే విధంగా మార్పులు చేసుకుంటూ , అనుకూల మైన  విధంగా కార్యాచరణ చేస్తూ ఉంటాడు . అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇందులోనే తనను తాను మోసం చేసుకునే ప్రక్రియ ఇమిడి ఉంది. మనిషి ఎన్నో జన్మలు గా దీనికి అలవాటు పడిపోయాడు. అందుకే మనిషి యొక్క స్పృహ  ఈ విషయం  నేడు గుర్తించ లేకపోతుంది . ఇతరుల పట్ల  జరిగే మోసాలను  చక్కగా గుర్తిస్తాడు  మనిషి ,  కానీ స్వయం  తన పట్ల తాను చేసుకుంటున్న మోసాన్ని  గ్రహించలేక పోతున్నాడు అనేది వాస్తవం.

• ప్రతీ మనిషి తనకు తోచిన విధంగా తాను జీవిస్తాను అని నిర్ణయించు కోవడం లోనే, తనను తాను మోసం చేసుకుంటున్నాను అనే విషయం గ్రహించ లేకనే మోసం చేసుకుంటున్నాడు.

మనిషి ఇతరులను మోసం చేయడం అనే దాని కంటే ముందు గానే తనను తాను మోసం చేసుకోవడం లో  సిద్ధహస్తుడు  అయినాడు . ఎందుకంటే తనను తాను మోసం చేసుకో గలిగిన వాడే ఇతరులను సమర్థవంతంగా మోసం చేయగలడు.

ఈ అలవాటు అనేక జన్మలు గా అలవాటు పడి పోయి ఉండడం వలన నేడు మనిషి శక్తి హీనుడై తన లోని  మనసా శక్తి  మరియు వాచా శక్తిని పూర్తిగా కోల్పోయాడు. ఈ వాచా శక్తి నే వాక్ సిద్ది అంటారు. మనసా శక్తి ని  మనో సిద్ధి, సంకల్ప సిద్ధి అంటారు . ఈ శక్తి హీనత వలనే మనిషి చేసే కర్మలు కూడా వికర్మలు గా అయిపోయాయి . . . మనం ఈ అంశాన్ని స్పష్టంగా గమనిస్తే ,  నేటి కాలంలో ఏదైనా భగవంతుని పూజ గాని, వ్రతం గాని చేసేటప్పుడు మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధి తో ఉంటాను అని అంటూ ఉండడం గమనార్హం. ఇలా ఎందుకు అనవలసిన అవసరం వస్తుంది అని కూడా మనం ఏనాడూ ఆలోచించం. 

• కొన్ని యగాల క్రితం అనగా త్రేతా, ద్వాపర యుగాలలో మనిషి నోటి తో ఏది పలికితే అది సిద్దించేది , ఫలించేది . కానీ నేడు మనిషి తన నోటితో ఏదైనా పలికినా, మాట్లాడినా బయట వారి సంగతి  సరే ,  ఇంటిలోని  సొంత వారే  , రక్త సంబంధీకులే  మాట వినే వారు లేరు.

దీనికి కారణం  మనిషి తన మాట లోని శక్తి పూర్తిగా కోల్పోవడం . అందుకు ప్రతిగా బ్రతిమాలో, శాసించో , హింసించో తన మాట ఇతరులు వినేలా చేసుకుంటున్నాడు. దీనికి కారణం మనిషి తనను తాను మోసం చేసుకోవడానికి అనాదిగా అలవాటు పడి పోయి ఉండడం. ఆ విషయం కూడా గుర్తించే కనీస అంతర్ముఖ పరిజ్ఞానం మనిషి కోల్పోయాడు.

• ఒక మనిషి , ప్రకృతి మరియు సృష్టి ధర్మాన్ని అనుసరించి నిజాయితీ తో తన ఆలోచన ఉన్నప్పుడు , అప్పుడు నోటి ద్వారా వచ్చే మాట యొక్క శబ్దాన్ని  ,  మనసు ద్వారా ఆలోచించే  ప్రతి సంకల్పాన్ని  యధావిధిగా అమలు పరిచే బాధ్యత ప్రకృతి, విశ్వం  రెండు తీసుకుంటాయి అని అనడం లో ఏ మాత్రం సందేహం లేదు . ఇందులో మనిషి కి  ఏ భారం, కష్టం ఉండదు .

అందుకే పూర్వ కాలాలలో సత్యవంతులు నోటి తో వరం ఇచ్చినా , మనసు తో సత్ సంకల్పం చేసినా జరిగి తీరేది.

• కానీ నేడు మనిషి అదే విధంగా ఎందుకు చేయలేక పోతున్నాడు ? అంటే కారణం ఒకటే మనిషి తనను తాను మోసం చేసుకోవడానికి అలవాటు పడి , పూర్తి శక్తి హీనుడు గా  అయి , తన ధర్మాన్ని సక్రమంగా ఆచరించలేక పోవడమే . అందుకే నేటి మనిషి లో సంపూర్ణత లేక  శ్రేష్టత లోపించి మానసిక అనాధ గా మిగిలి జీవిస్తున్నాడు .

ఇందులో  ప్రస్తుత కలియుగం లో ఉన్న ఏ మనిషి కి మినహాయింపు లేదు. అందుకే అన్నాను , మనిషి మహా మోసగాడు. … ముఖ్యం గా తనను తాను మోసం చేసుకోవడం లో మాత్రమే మహా మోసగాడు .

• మనిషి పొందే ఈ స్థితి కి కారణం కూడా లేకపోలేదు. అదే మనిషి కి కమ్మేసిన మాయ. ఆ మాయ నే  వికారాల బలహినత అని అంటారు.

• మనిషి తన బలహీనతలను యధార్థ రీతిలో తెలుసుకొని అధిగమించి నాడు అద్వితీయమైన శక్తి స్వరూపుడు అవుతాడు. ఈ బలహీనతలను అధిగమించాలి అంటే, విఘ్నాలను ఎదుర్కోవడానికి శివ స్మరణ , పరమాత్మ శివుని యొక్క సాంగత్యం, శివుని తో అనుక్షణం మానసిక సాన్నిహిత్యం అత్యంత అవసరం. ముందుగా తన జన్మకు మూలం తెలుసుకోగలగడం .

• అనాది గా మనిషి తనను తాను మోసం చేసుకోవడం వలనే తనలో ఉద్భవించే దుఃఖానికి అశాంతికి  నేడు కారణభూతుడు  అవుతున్నాడు. తాను మోసపోకుండా, తనను తాను మోసం చేసుకోకుండా ఉండ గలిగే  అభ్యాసం , శివ పరమాత్మ జ్ఞానం తో రచించబడిన బ్రహ్మ కుమారీస్ రాజయోగ శిక్షణ ద్వారా మాత్రమే విని ఆచరించడం వలన సాధ్యం .


  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏

  యడ్ల శ్రీనివాసరావు 24 Nov 2025 9:00 PM.


Wednesday, November 19, 2025

707. నీ వెవరో నీకు తెలియాలి

 

నీ వెవరో నీకు తెలియాలి




• తెలియాలి    తెలియాలి

  మనిషి కి    తానెవరో     తెలియాలి .

• తెలియాలి    తెలియాలి

  మనిషి కి    తన  జన్మకి   కారణ     తెలియాలి


• తెలియక    గడిపే   కాలం

  మనిషి కి    జన్మాంతరాలు   అంధకారం .

• తెలియక    గడిపే   జీవనం

  చుక్కాని    లేని    నావ   పయనం .


• అందుకే . . .

• తెలియాలి    తెలియాలి

  మనిషి కి   తానెవరో    తెలియాలి.

• తెలియాలి     తెలియాలి

  మనిషి కి  తన  జన్మకి   కారణ తెలియాలి .


• తన  మూలం   తెలియాలంటే

  అందుకు . . .

  చేయాలి   శివుని తో   నిత్యం   ధ్యానం యోగం .

• తన   మర్మం    తెలియాలంటే

  అందుకు . . .

  వినాలి    సత్య    బ్రహ్మ  జ్ఞానం .


• జ్ఞాన యోగాలు    తెలియక

  దుఃఖ సాగరం

  ఈదుతున్నాడు   నేటి   మనిషి .

• ఆశనిరాశ  ల    తీరు తో

  పాప పుణ్యాలు

  ఎరుగకున్నాడు   నేటి  మనిషి .


• శాంతి   సుఖము   ఎరుగక

  మనసు   అలజడుల తో   సహవాసం

  చేస్తూ  ఉంది .

• అల్ప   కాలిక    కోర్కెల తో

  బుద్ధి   అర్థాయుష్షు తో    జీవనం

  సాగిస్తుంది.


• అందుకే . . .

• తెలియాలి     తెలియాలి

  మనిషి కి    తానెవరో     తెలియాలి.

• తెలియాలి      తెలియాలి

  మనిషి కి    తన  జన్మకి   కారణ     తెలియాలి .


• తన   మూలం  తెలియాలంటే

  అందుకు . . .

  చేయాలి  శివుని తో   నిత్యం   ధ్యానం యోగం

• తన    మర్మం   తెలియాలంటే

  అందుకు . . .

  వినాలి    సత్య   బ్రహ్మ  జ్ఞానం .


• భక్తి లో   మిగులుతున్నది   రోదన .

  అందుకు   నిదర్శనం

  ఆలయాల  తొక్కిస   మరణాలు .


• భక్తి లో    కలుగుతున్నది   వేదన .

  అందుకు    నిదర్శనం

  ఆలయాలలో   ఖరీదైన   పూజలు .


• భక్తి లో    అనుభవిస్తున్నది   యాతన .

  అందుకు   నిదర్శనం

  ఆలయాలలో   గంటల   తరబడి    నిరీక్షణ.


• మనిషి కి    తానెవరో   తనకు

  తెలియని    కాలమంతా

  దైవాన్ని    శిల లోనే    చూస్తాడు .


• తానెవరో   తాను   తెలుసుకున్న నాడు

  శివుడే  తన తండ్రని   సత్య మెరిగి 

  తన   మనసు లోనే   చూస్తాడు .


• అందుకే . . .

• తెలియాలి    తెలియాలి

  మనిషి కి    తానెవరో     తెలియాలి.

తెలియాలి    తెలియాలి 

 మనిషి కి    తన   జన్మకి    కారణ  తెలియాలి .


• తన   మూలం   తెలియాలంటే

  అందుకు

  చేయాలి  శివుని తో   నిత్యం   ధ్యానం యోగం

• తన    మర్మం   తెలియాలంటే

  అందుకు

  వినాలి    సత్య   బ్రహ్మ  జ్ఞానం .


🌹🌹🌹🌹

• నేటి కలియుగం అంత్య సమయం లో , సృష్టి వినాశన కాలం లో మనిషి పూర్తి అచేతనుడై , అంధకారంలో  తాను ఎవరో తాను తెలుసుకో లేక , అన్ని  సంపదలు సమృద్ధిగా ఉన్నా  సరే , కష్టాలకు తాళలేక,  దుఃఖం భరించలేక మరియు మితి మీరిన కోరికల సఫలత కోసం , భగవంతుని పొందుట కోసం భక్తి చేస్తూ అనేక ఆలయాలు చుట్టూ తిరుగుతూ ప్రయాస పడుతున్నాడు అనేది వాస్తవం . 

కానీ , ఇందులో ముఖ్యంగా భాధపడ వలసిన అంశం, ఈ మధ్య కాలంలో తరచుగా ఆలయాల లో ప్రాణాలు కోల్పోతున్న కొందరి రోదన . . ‌.

భగవంతుని కోసం చేసే ఖరీదైన వ్రతాలు , కళ్యాణాలు పూజలు  , తీర్థయాత్రలు , పుష్కరాలు , గంగా స్నానాల పేరుతో  చేసే అమాయక పేదవారి అప్పుల వేదన  . . . 

భగవంతుని దర్శనం కోసం రోజులు గంటలు తరబడి Q లైన్ల లో నిరీక్షణ తో అనారోగ్యాల బారిన పడే మహిళలు , వృద్ధుల యాతన .

  ఆలోచించండి . ‌ . . వీటన్నింటితో

• నిజం గా భగవంతుడు మనిషికి లభిస్తున్నాడా ?

• భగవంతుడు మనిషికి సాక్షాత్కారం ఇస్తున్నాడా ?

• భగవంతుడిని ,  మనిషి స్వయం గా మనసు తో నిరంతరం  అనుభవం చేయగలుగుతున్నాడా ?


• ఓ మనిషి ముందు అసలు నీవు ఎవరో తెలుసుకో , అసలు నువ్వు ఎక్కడ నుంచి ఈ భూమి మీదకు  వచ్చావో , అసలు ఎందుకు వచ్చావో  తెలుసు కో.  ఏ కారణం లేకుండా నీవు జన్మించవు కదా ?  . . .  ఇది తెలుసుకున్న నాడు , భగవంతుడు స్వయంగా నీ చేతిని స్పృశించడం ఆరంభిస్తాడు . 

అందుకోసం నీవు   ఈ వేదన రోదన యాతన పడవలసిన అవసరం లేదు. నిత్యం వేకువజామున నిద్రలేచి , ఇంటి లోనే ఉండి శివుని తో అనుసంధానం అయి ధ్యాన యోగం చెయ్యి . శివుని యొక్క సత్యమైన బ్రహ్మ జ్ఞానం, నీకు దగ్గర లో ఉన్న బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారి , ఓం శాంతి ధ్యాన ఆశ్రమం నందు ఉచితం గా ఒక అరగంట విను . అప్పుడు భగవంతుని తో నీ ప్రయాణం ఎంత అత్యుత్తమంగా ఉంటుందో కనీసం ఊహించడానికి , నీ శక్తి కూడా సరిపోదు.

• శివుని ని , నీ మనసు లో   ప్రేమ తో తండ్రి గా ఆరాధించు , మాట్లాడు . నీకు ఏ ప్రయాస వేదన రోదన యాతన ఉండదు. నీకు మిగిలేది అనంతమైన ఆనందం సంతోషం . నీ జీవితానికి సఫలత లభిస్తుంది . ఇంతకు మించి నీకేం కావాలి ? ఆలోచించు. పోయేది ఏమీ లేదు. 


గమనిక : క్షమించాలి .... ఇది ఏ ఒక్కరి భక్తి యెక్క మనోభావాలను  ఉద్ధేశించి కాదు .  భక్తి ద్వారా అనేక జన్మలు నుంచి మనిషి పొంద వలసిన సఫలత పొంద లేక ఇంకా దుఃఖం అనుభవిస్తూ నే ఉన్నాడు .   దీనికి కారణం భగవంతుని యధార్థం ఏమిటో తెలియక పోవడం. మరియు మనిషి కి తన యధార్థం  ఏమిటో తెలియక పోవడం.  భగవంతుడికి  చేసే భక్తి , తాను ఉన్న చోట నుండి, తాను ఉంటున్న స్థితి నుంచి  మనసు ను భగవంతుని తో అనుసంధానం చేయడం ద్వారా తన జన్మ కు , జీవితానికి సఫలత పొందగలడు.  ఇది ధ్యానం యోగం ద్వారా సాధ్యం అవుతుంది.

రెండు కళ్ళ తో చూసిన భగవంతుని ప్రతిబింబం దేహం లో  తాత్కాలికంగా కొన్ని సెకన్లు ఉంటుంది . మనో నేత్రం, జ్ఞాన నేత్రం తో చూసే భగవంతుని జ్యోతి బిందు స్వరూపం  మనసు లో శాశ్వతంగా ఉంటుంది .



  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు 19 Nov 2025 6:30 PM.


Monday, November 17, 2025

706. శైవం

 

శైవం



• ఈ మానవ  జన్మలో  ఈ లౌకిక ప్రాపంచిక విషయాలు మద్యలో ఉండి భగవంతుని వెదుకుట అనేది శూన్యం లో పదార్థం గూర్చి వెదకటమే . ప్రతి మానవునికి  దేహం లో  పంచ కర్మేంద్రియాలతో పాటుగా , ఆత్మ లో "జ్ఞాన నేత్రం" అనేది ఆది నుంచి ఉంది . ఎందుకంటే  ఆత్మ స్వరూపులమైన   మనం ఆ మహా దేవుడైన పరమాత్మ శివుని సంతానం.  తండ్రి శివుడు కలిగి ఉన్న జ్ఞాన నేత్రం, మనో నేత్రం మనలో కూడా ఉంది. కానీ ద్వాపర కలియుగాల నుంచి  అనేక జన్మలు గా మనం అనేక పాప కర్మలు చేస్తూ, వికారాలకు వశం అయిపోవడం వలన , మన ఆత్మ తన యొక్క దివ్య శక్తులను పూర్తిగా కోల్పోయి  మన లోని మనో నేత్రం, జ్ఞాన నేత్రం మూసుకుపోయి  నేడు  ఉంది .


• ఈ జ్ఞాననేత్రం లేదా మనో నేత్రం ఎప్పుడు మనలోనుండి  ఈ లోకమును చూడగలుగుతుందో ఆ దశ మన జన్మ కి , జీవితానికి అత్యుత్తమ ఉచ్చ దశ అనుకోవచ్చు.  ఈ దశ లో మనకు ప్రాపంచిక విషయాలు తో పాటు దైవిక చింతన మోక్ష మార్గ సాధన పరమాత్మ సాక్షాత్కారం ఇలా అనేకానేకమైన పరతత్వపు  విషయాలు గోచరిస్తూ ఉంటాయి.

జ్ఞానాన్ని ఆపాదించడం అంటే మహా మహా క్రతువులు ఆచరించడం లేదా పరమ పాండిత్యాన్ని పొంది ఉండటం లేదా మరేదైనా ఉన్నత పదవులను అదిరోహించడం కాదు. సర్వ సంగ పరిత్యాగులుగా  మారటం లేదా ఘోర అఘోర క్రియల్లో నైపుణ్యం కల్గి ఉండడం ఇవి మాత్రమే ఆధ్యాత్మికతకు కొలమానములు  కావు , అలాగని ఇవి కలిగి ఉన్నవారు మోక్ష సాధకులు కారనీ చెప్పజాలను .


• నీయొక్క కర్మలను లేదా  నీ నడవడికని సహేతుకమైనదిగా  మార్చుకొని , మనసు ను అనుక్షణం దైవ చింతన , పరమాత్మ స్మృతి యందు ఏకాగ్రతం కావించన  యెడల ,  నీ  శిరస్సు పై ఉన్న వికర్మల భారం తొలగి జ్ఞానమార్గం  వైపు పయనం ఆరంభం అగును. అదే ముక్తి మార్గం అదే శివుని మార్గం.


• కమల పుష్పం బురదలో  వికసిస్తుంది. అదే విధంగా ఆకర్షణ లతో నిండిన ఈ మాయ లోకం లో నీవు. జీవిస్తూ నే . . . విస్తారము , లోతు తెలియని సంసారం అనే మహా సాగరం లో  నీవు జీవిస్తూ నే , అతీతంగా  నీ  మనసును శివుని పై లగ్నం చేసిన నాడు నీవు తప్పక ఒక వికసిత కమలం అవుతావు అనడం లో ఏమాత్రం సందేహం లేదు .

• శివుని మార్గములో నీవు ఆచరించ వలసినది సత్కర్మ. అంతకు మించి ఏదీ లేదు. నీకు పరమాత్మ ఇచ్చిన విచక్షణ చేత , నీ బుద్ధి తో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని , ఆచరణ చేయు నీ కర్మ ఫలితమే దైవ మార్గమునకు సూచికము , అదే శైవ మార్గము. ఒక్కసారి శైవ మార్గము లోకి వచ్చావో  నీ బ్రతుకు పండిపోయినట్టే  , నీవు కైలాస లోక ఆనందాది అనుభూతులతో నిత్యం శివ తేజస్సుతో వర్ధిల్లుతూ ఉంటావు. 

గుర్తు పెట్టుకో  "ఏకం దైవం విరసిత శైవం".


 ఓం శాంతి

 ఓం నమః శివాయః 


యడ్ల శ్రీనివాసరావు 17 Nov 2025 2:00 PM.


Friday, November 7, 2025

705. దర్పణం

 

దర్పణం 




• తలతు  ను    నీ   నామ ము

  తపన  తో      నీ   ధ్యాన ము 

  వెరసి న     యోగ మే    ఈ కాల ము .

• మనసు  న     శూన్య ము

  మరపు   న      మోక్ష ము

  కలసి న     భోగ మే     ఈ   జీవ ము .


• మరణ  మెరుగని    ఆత్మ   నేను 

  మాన వ   పాత్ర   లెన్నో     జన్మలు

  వేసితి  .

• బంధనాల   పాత్రల తో 

  పాపపుణ్యా  లెరుగని   వాడై   

  ఎన్నో   కర్మలు   జేసితి .


• మాయ  లోక మందు  

  నేను  మరచి     నిన్ను   వీడితి  .

• మనసు   మార్చి    

  మహిమ   తెలిపి 

  మమత  చూపే   తండ్రి వి .


• తలతు ను    నీ   నామ ము

  తపన తో      నీ    ధ్యాన ము

  వెరసి న   యోగ మే    ఈ  కాల ము.

• మనసు న    శూన్య ము

  మరపు  న     మోక్ష ము

  కలసి న   భోగ మే    ఈ  జీవ ము .


• దారి   తెన్ను  లేని  వాడై 

  ధరణి  లో    తిరిగి తి  

  దారి  చూపి      దయ ను  నేర్పి     

  దాత  వైన   తండ్రి వి  .


• కర్మ   బంధనాలు  వీడి  

  కడకు   నిన్ను   చేరి తి  .

  కరుణ  చూపి     ప్రేమ  నేర్పి  

  ఆదరించే    తండ్రి వి .


• తలతు ను       నీ   నామ ము

  తపన   తో       నీ   ధ్యాన ము

  వెరసి న   యోగ మే    ఈ కాల ము .

• మనసు న     శూన్య ము

  మరపు   న     మోక్ష ము

  కలసి న    భోగ మే   ఈ  జీవ ము .



ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు  7  Nov 2025 9:00 pm.


Tuesday, November 4, 2025

704 .కార్తీక భామ

 

కార్తీక  భామ



• ఓ భామ   . . .  చందభామ

  నిండు    పౌర్ణమి లో

  నీ పలకరింపు    ఓ  పులకింత .


• ఓ   భామ   . . .   చందభామ

  ఓ   భామ   . . .   చందభామ .


• నీ    చిరుమందహాసం తో 

  చీకట్లను     లాలించి . . .

  నిశి   లోని     నింగి ని

  నా   ముందు   పరిచావు .


• నీ   మౌన     భావం తో 

  మేఘాలను    దాటించి . . .

  ఇల  లోని   కొంగు గా

  నా  చుట్టు   చుట్టావు .


• ఓ   భామ   . . .   చందభామ

  నిండు   పౌర్ణమి లో

  నీ  పలకరింపు    ఓ   పులకింత .


• కన్నయ్య     మనసు కి

  వెన్న    తినిపించేను    నీ   వెన్నెల .

• ముత్యాల     మురిపాలు

  పొంగి    పొర్లేను     నా   కన్నుల .


• కార్తీక పౌర్ణమి న      నీ   దర్శనం

  పరమ    పవిత్రం .

• నీ  ఒడి ని   తాకే      నా  చూపు

  నోములు    అర్పితం .


• ఓ   భామ.   . . .   చందభామ

  ఓ    భామ    . . .   చందభామ .


• దారి  తెలియని    నీ   దూరానికి

  రహదారి  యే      నా   పదం .

• ఆశ   తెలియని    నా  మనసు కి

  ఆరాధనే      నీ    ప్రకాశం .


• ఓ    భామ   . . .   చందభామ

  ఓ    భామ    . . .   చందభామ .


  నోములు = వ్రతం .


చంద్రుని పై   ప్రేమ తో   ఓ  రోహిణి .

యడ్ల శ్రీనివాసరావు 4 Nov 2025 9:00 pm.


Sunday, November 2, 2025

703. నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం

 


 నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం 



• మన జీవితంలో  ఎప్పుడూ , ఎవరో ఒకరైనా  అసౌకర్యం  కలిగించే వ్యక్తి  ఉంటారు. వారు దాదాపు అన్ని సమయాలలో చికాకు పెట్టే విధంగా ఏదో ఒకటి చేస్తారు లేదా వారు చేసే పని మనల్ని చికాకు పెట్టే విధంగా ఉందని మనం అనుకుంటాము.

కొన్నిసార్లు అవతలి వ్యక్తికి ఆ ఉద్దేశ్యం లేనప్పటికీ, వారి స్వభావం మాటిమాటికీ గుర్తు పెట్టుకొని వారు ఆ విధంగానే ఉన్నారని మనం భావిస్తాము. దీనికి ప్రతిచర్యల  రూపంలో  మనం బదులిచ్చినటువంటి ప్రతీది  ఒక నెగెటివ్ ప్రభావం క్రియేట్ చేస్తుంది. 

ఈ నెగిటివ్ భావాల ప్రభావాలు   మన వరకే పరిమితమైనట్లైతే , అవి మనకు మాత్రమే అసౌకర్యాన్ని కలిగిస్తాయి . 

 కానీ ఈ భావాలు   చర్యలు (actions) చేయడం ఆరంభిస్తే,  నెగెటివ్  చర్య (action) ప్రతిచర్యల (reaction) చక్రాన్ని  ప్రారంభిస్తాయి, తద్వారా అలాంటి హానికరమైన భావాలు అవతలి వ్యక్తికి చేరుకుంటాయి.


• ఈ ఎనర్జీ ని   స్వీకరించినప్పుడు , అవతలి వ్యక్తి మనల్ని  నెగిటివ్ గా అనుకోవడం , స్పందించడం లేదా మన గురించి నెగటివ్ గా ఆలోచించడం ప్రారంభిస్తాడు. మనకు మరియు అవతలి వ్యక్తికి మధ్య  కనిపించని  యుద్ధం  ప్రారంభమవుతుంది. నెగిటివ్ ఆలోచనలు, భావాలు, వైఖరులు, మాటలు మరియు చేతలు ఇచ్చిపుచ్చుకుంటాము . అవతలి వ్యక్తితో నెగిటివ్ కర్మల ఖాతాలు లేదా బంధనాలు సృష్టించబడతాయి. 

ఈ నెగిటివ్ కర్మల ఖాతాలు పెరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు,  మనం లేదా అవతలి వ్యక్తి , ఎప్పటికప్పుడు , భౌతికంగా  లేదా ఆలోచనలు సంకల్పాలతో   పాజిటివ్ గా  వ్యవహరించినా లేదా ప్రతిస్పందించినా , నెగిటివ్ బంధనాలు బ్రేక్ చేసి సంబంధాన్ని పాజిటివ్ గా మారుస్తుంది లేదా బంధనాలను  చాలా తగ్గిస్తుంది. 

కానీ , తక్కువ పాజిటివ్‌ తో  పాటు ఎక్కువ నెగెటివ్‌లు ఉంటే ,  నెగటివ్‌ ప్రభావాలను కొద్దిగా తగ్గిస్తుందే కానీ పూర్తిగా తొలగించదు.


 💐  💐  💐  💐  💐


• ఒక వ్యక్తితో నెగిటివ్ శక్తి మార్పిడి యొక్క చక్రాన్ని బ్రేక్ చేయడానికి మొదటి పద్ధతి  స్వపరివర్తన .

స్వ పరివర్తన యొక్క మొదటి మెట్టు ఎదుటి వ్యక్తికి మాటల్లో తిరిగి నేను ప్రతిస్పందించను . కానీ నేను ఇతరుల నుండి పొందిన నెగిటివ్ శక్తిని , భౌతిక రూపాల్లో అనగా  నెగిటివ్ ఆలోచనల హావభావాలు , అంతర్ దృష్టి , మరియు చేతల ద్వారా ఇతరులకు  వ్యక్తపరుస్తూ  నెగిటివ్ వాతావరణాన్ని  సృష్టిస్తాను . 

దీని వలన  ఇతరుల మనస్సులలో   ఆ వ్యక్తి గురించి   నెగిటివ్ అవగాహన  కలిగిస్తుంది. ఆ వ్యక్తి వలన  సంబంధాల సఖ్యత కు హాని జరిగినందున భౌతిక స్థాయిలో నష్టం జరుగుతుంది. నష్టం జరిగాక నియంత్రించవలసి   ఉంటుంది, ఇది కొన్నిసార్లు చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మనం ఈ నెగిటివ్ సమాచారాన్ని చుట్టూ ఉన్న ఇతరులకు , మరియు కొన్నిసార్లు  మనకు హాని చేసినట్లుగా  మనం ముందుగా భావించిన వ్యక్తికి  కూడా  చేరవేస్తాము .


స్వ పరివర్తన యొక్క కొంచెం లోతైన రెండవ పద్ధతి స్థాయి ఏమిటంటే, నాకు హాని చేసిన వ్యక్తి కి నేను ప్రతిస్పందించకపోవడమే  కాకుండా నాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులెవరితోనూ   ఆ వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడను. కానీ నేను అవతలి వ్యక్తి గురించి నెగిటివ్ గా ఆలోచిస్తూనే ఉంటాను. అటువంటి సందర్భాలలో, నా ఆలోచనలు మరియు భావోద్వేగాలు పూర్తిగా నా నియంత్రణలో లేనందున, హావభావాలనే  తెరల వెనుక తెలియకుండా మరియు గుప్తంగా జరుగుతుంది. అటువంటి ఆలోచనలను తెలిసి చేసినా లేదా అంతర్గత బలం లేకపోవడం వల్ల అవి అనుకోకుండానే చేసినా ఆలోచనలు, భావోద్వేగాలు ఈ రకంగా ఉండటం, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాథమిక అంశాల ప్రకారం తప్పు. ఈ నెగిటివ్ ఆలోచనలు మరియు భావోద్వేగాలు ఒక సూక్ష్మ స్థాయిలో అవతలి వ్యక్తికి చేరుకుంటాయి, ఆ వ్యక్తితో సంబంధాలను దెబ్బతీస్తాయి.


స్వ పరివర్తన యొక్క మూడవ మరియు లోతైన స్థాయి నా ఆలోచనలు, భావాల క్వాలిటి మార్చుకునే శక్తిని నేను పెంచుకుంటాను . నా ప్రతిచర్యలకు  మూలమైన లోపాన్ని (బలహీనతను) తొలగించడానికి నేను మానసికంగా శక్తిని పొందుతాను, తద్వారా నన్ను బాధపెట్టేది ఏదీ కూడా  ఇకపై ఇది వరలా  బాధపెట్టలేదు . తద్వారా అందరూ కోరుకున్నట్టుగా  సంబంధాలను కాపాడుకోగలను  . 

ఇముడ్చుకునే శక్తి,  స్వపరివర్తనలను ఉత్తమంగా ఆచరించినట్లవుతుంది. ఇందులోనే మరొకరితో నెగిటివ్ శక్తి మార్పిడిని ఆపగల సామర్ధ్యం పుష్కలంగా  ఉంటుంది .


యడ్ల శ్రీనివాసరావు 21 Oct 2025 11:30 AM



Wednesday, October 29, 2025

702. ప్రియ సఖుడు

 

ప్రియ సఖుడు


• మదిలో    మెరుపు    మైమరిపించే

  ఈనాటి    స్వప్నం లో .

• ఒడిలో    తలపు   వరమనిపించే 

  ఆనాటి    జన్మం  లో .

• కనులు     తెరవ గానే

  కాంతి    లోన    నీవు .

• కనులు  మూయగానే 

  కవ్వింత  లో      నేను .


• ఆనంద  నాధుడా 

‌  అరవిరిసిన     నీ   ప్రేమ ని

  ఆదమరచి    నాను .


• ఊపిరి   తాకిన   నీ    స్నేహం .

  ఈ కాలం   ఎరుగని    బంధం .


• ప్రియడి వైన    నీ    ఆరాధన లో

  పంచభూతాల    పరిమళం   తాకింది .

• సఖుడ వైన      నీ    సాంగత్యం లో

  ఈ పదములు    ప్రాణం    పోసుకున్నాయి .


• విరహం    ఎరుగని      ఈ  రాగం లో

  వైరాగ్యం   లేదు .

• కొలమానం   ఎరుగని   నీ  ప్రేమం లో

  కలవరం    లేదు .


• మదిలో   మెరుపు    మైమరిపించే

  ఈనాటి     స్వప్నం లో .

• ఒడిలో    తలపు     వరమనిపించే

  ఆనాటి      జన్మం లో .

• కనులు      తెరవ  గానే

  కాంతి  లోన   నీవు .

• కనులు      మూయగానే

  కవ్వింత లో    నేను .



యడ్ల శ్రీనివాసరావు 30 Oct 2025 , 9:30 PM.


Tuesday, October 28, 2025

701 . సెలయేరు కన్నీరు

 

సెలయేరు  కన్నీరు



• జారే    నీరు    సెలయేరు

  మదిలో   పారే   నీరు    కన్నీరు .


• సెలయేటి    పరవళ్ళు

  చక్కంగా    నింపెను    ఆనందం .

• కన్నీటి       కడగండ్లు

  వెచ్చం గా    కడిగేను    విచారం .


• జారే    నీరు    సెలయేరు 

  మదిలో   పారే   నీరు   కన్నీరు .


• సెలయేటి     తుంపరలు

  సంబరాలకు     అంబరం  .

• తొణికిసల      పరవశం

  చిరునవ్వుల    కోలాటం .


• కన్నీటి      ఉద్వేగాలు

  అంతరాల   ఆవేదనలు .

• కరుగుతున్న    క్షణికం లో

  హృదయానికి    ఉప్పెనలు .


• జారే    నీరు     సెలయేరు

  మదిలో   పారే   నీరు  కన్నీరు .


• సెలయేటి      నీరు     జీవామృతం .

  మది మీటిన   నీరు     మధురామృతం .


• ప్రాణానికి       తెలుసు   నీటి  మహత్యం 

  హృదయానికి  తెలుసు  కన్నీటి   కావ్యం .


• ఈ    నీటి   రూపాలు

  మనిషి కి

  సుఖదుఃఖాల   ఆటలు .


• జారే    నీరు    సెలయేరు

  మదిలో   పారే   నీరు   కన్నీరు .


యడ్ల శ్రీనివాసరావు  28 Oct 2025 9:30 AM.


Friday, October 17, 2025

700. వ్యక్తుల నుండి భావోద్వేగ స్వతంత్ర్యత

 

వ్యక్తుల నుండి భావోద్వేగ  స్వతంత్ర్యత 





భావోద్వేగాలు 

సంతోషం, విచారం, కోపం, భయం, ప్రేమ, శత్రుత్వం.


• మనకున్న బంధాలలో, కొన్ని బంధాలపై మనం భావోద్వేగంగా ఆధారపడి ఉంటాం. మనం ఇతరుల అవసరాలు ,  అభిప్రాయాలు మరియు భావాల గురించి ఆలోచిస్తూ అసమంజసంగా  సమయాన్ని వెచ్చిస్తాము . మన సొంత అవసరాలు ప్రక్కకు వెళ్ళిపోతాయి ఎందుకంటే మన భావాలు , నిర్ణయాల నియంత్రణను పూర్తిగా ఇతరులకు ఇచ్చేస్తాము . వారు మనల్ని  ప్రేమించాలని వారి నుండి ఆశిస్తూ వారిపై ఆధారపడి ఉంటాం, ఇది ఇరువురికీ మంచిది కాదు.


• మీ మనసు ఎవరితోనైనా భావోద్వేగంగా చిక్కుబడి  ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా?

• ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ మీ మనసులో ఉంటున్నారా ? అటువంటి వ్యక్తి ప్రవర్తనలో కొద్దిగా తేడా వచ్చినా మీ మనసు పాడవుతుందా ?

• భావోద్వేగంగా ఇతరులపై ఆధారపడటం మనం అనుకున్న దానికన్నా  చాలా ప్రమాదకరమైనది.  ఇది గాఢమైన వ్యసనంలా  కూడా మారవచ్చు.  మన మనసు కొందరి ప్రవర్తనపై ఆధారపడి ఉన్నప్పుడు , వారు మనం కోరుకున్న విధంగా ఉండాలని ఆశిస్తాం. ఎప్పుడూ వారి నుండి  ప్రేమ , పలకరింపు ,  సాన్నిహిత్యం  ,  అభిప్రాయాలు  మరియు వారి  సమ్మతిని  కోరుకుంటాము . ఇందులో  ఏ   ఒక్కటి లభించకపోయినా  గానీ మనకు అభద్రతా భావన కలుగుతుంది . నిజానికి  మనకు భావోద్వేగంగా చాలా శక్తి ఉంది .  మనకు వారి నుండి ఏమీ అవసరం లేదు . వారు ఎలాంటి వారో అర్థం చేసుకుని వారితో అలాగే వ్యవహరిద్దాం , అంతేకానీ నాకు భావోద్వేగ హాయిని వారు అందించాలని  ఆశించ వద్దు . నిజమైన ప్రేమ అన్నింటి నుంచి శాశ్వతమైన విడుదలను  ఇస్తుంది . అలాకాకుండా ,  ఆధారపడి ఉంటే అది వారినీ , మనల్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 

మిమ్మల్ని మీరు ప్రేమించు కోండి . మీ మనసుతో సమయాన్ని గడపండి. మనసుకు గుర్తుచేయండి – నా బంధాలు భావోద్వేగ స్వతంత్ర్యత మరియు ప్రేమ అను పునాదిపై నిల్చుని ఉన్నాయి.


• ప్రశాంతంగా కూర్చుని, వ్యక్తుల నుండి భావోద్వేగంగా  ఆశ్రితమై ఉండే స్వభావాన్ని ఎలా తొలగించుకోవాలి , తిరిగి స్వాతంత్ర్యాన్ని ఎలా పొందాలి అని ఆలోచించండి . మిమ్మల్ని మీరు స్పష్టంగా చూసుకోండి , మీ అవసరాలను గుర్తించండి . మీ ఆత్మ గౌరవం పెరుగుతుంది , మీ మమకారాలు, ఆశ్రిత తత్వం  తగ్గుతాయి . 

మీకు మీరు  ఇలా  గుర్తు చేసుకోండి  –  నేను  శక్తిశాలి స్వరూపాన్ని .  నేను భావోద్వేగపరంగా  స్వతంత్రంగా ఉన్నాను ,  నాకు ఎలా కావాలో , ఏమి కావాలో నాకు తెలుసు . నా ఆంతరిక ప్రపంచాన్ని ఎవ్వరూ  ప్రభావితం  చేయలేరు . ఇదే నా  జీవన మంత్రం అని మననం చెయ్యండి .

భావోద్వేగాలు  చూపడం ,  ఆశించడం  కన్నా  . . . . .  గౌరవించడం ,  గౌరవించ బడడం మిన్న .


ఆశ్రితము =   ఆశ్రయించడం, ఆధారపడడం


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 17 Oct 2025 9:00 PM.


714 . మనసు మాయ

  మనసు మాయ   • భ్రమ లలో    బ్రతుకు    భారము   మనసా   ఓ   మనసా   భ్రమ లలో    బ్రతుకు    భారము . • భ్రమ చుట్టూ    భ్రమణమే   మాయ   అది యే ...